సోనియా పార్టీ సీనియర్ నాయకులతో తెలంగాణపై మంతనాలు జరుపుతున్న సమయంలోనే రాష్ట్ర మంత్రి, సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ 10, జనపథ్లోకి వెళ్లి కొన్ని పత్రాలను అందజేయటం గమనార్హం. కన్నా లక్ష్మీనారాయణ ఈ పత్రాలను ఎవరికి అందజేశారనేది వెల్లడికాలేదు. సోనియా నివాసంలోకి తాను ఎందుకు వెళ్లాననేది వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఇదిలా ఉంటే తెలంగాణ వివాదంపై చర్చించేందుకు ఢిల్లీకి రావలసిందిగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని పార్టీ అధినాయకత్వం ఆదేశించిందని అంటున్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై తెలంగాణ అంశంపై మరోసారి సమీక్ష జరుపనున్నది. అయితే సోనియా నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కనిపించడంతో అనేక ఊహాగానాలపై తెరలేచింది. సోనియాగాంధీనే కన్నాను పిలిపించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కన్నాకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారని, దాని ద్వారా రాష్ట్రంలో బలమైన కాపు సామాజికవర్గాన్నితన వైపు పూర్తి స్థాయిలో మళ్లించుకోవడం ద్వారా ఎక్కువ స్థానాలు సాధించాలన్న వ్యూహంతో చాలాకాలం నుంచి కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సాంకేతికంగా బీసీకి చెందిన తూర్పు కాపు అయినప్పటికీ మానసికంగా కాపు గానే భావిస్తున్నారు.
అయితే అసలు కాపులకు తూర్పు కాపులకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించిన నాయకత్వం, కోస్తాలో బలమైన కాపు సామాజికవర్గంలో ఇమేజ్ ఉన్న కన్నాకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వనుందన్న ప్రచారం కొద్దిరోజుల నుంచి వినిపిస్తోంది. రెడ్డి, క్రైస్తవ, దళిత క్రైస్తవ, మైనారిటీలో కొంతభాగం జగన్ పార్టీవైపు చూస్తున్న నేపథ్యంలో బలమైన కాపు వర్గాన్ని తమ వైపు ఆకర్షించాలన్న వ్యూహంలో భాగంగానే నాయకత్వం కన్నాను పిలిపించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనేకసార్లు కన్నాకు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో ఒకసారి చేజారిపోయింది. రెండుసార్లు ఎం.సత్యనారాయణరావు, బొత్స పీసీసీ అధ్యక్షుడయిన సమయంలో కూడా కన్నా పేరు ముందు వరసలో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాను సోనియాగాంధీ అపాయింట్మెంట్ కోసమే ఆమె నివాసానికి వెళ్లానని, సోనియాను కలవలేదని కన్నా మీడియాకు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more