రాష్ట్రంలో రాజకీయ వేడితో పాటు, కరెంట్ కూడా బాగా షాక్ కొడుతుంది. కరెంట్ ఛార్జీలు పెంపునకు నిరసనగా వామపక్షాలు నిరసనలు , దర్నాలు చేశాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఎర్రదండు నిరసన మంటలే రగిలాయి. అయితే ఎర్రదండు నాయకులు మాత్రం ప్రభుత్వం పై కన్నెర్రజేశారు. ఇంధన సర్ చార్జీలు, విద్యుత్ ఛార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున్న ఉద్యమించాయి. ఛార్జీల పెరుగుదలతో ప్రజలకు విద్యుత్ స్తంబాలు ఉరికంబాలు గా మారాయని ఎర్రదండు నాయకులు అంటున్నారు. కరెంట్ చార్జీల సమస్య ప్రజలదని, అన్ని పార్టీలు ఈ పోరాటంలో కలిసిరావాలని పిలుపునిచ్చారు. అవసరమైతే శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి విద్యుత్ ఛార్జీలపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం వేయనంత భారం కరెంట్ చార్జీల పెరుగుదలతో రూ. 12,700 కోట్ల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై వేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజా ప్రతినిధులు, మంత్రులు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే .. విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని ప్రజలకు పిలుపునివాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఈ ఉద్యమాన్ని బషిర్ బా్ తో పొల్చుకోలేమని, దానికన్నా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఛార్జీల పెరుగుదల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వాన్నికి ఎప్రిల్ ఒకటో తేదీ దాకా గడువు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తే కరెంట్ తీగతలతో ఉరివేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. ప్రభుత్వానికి అన్ని డెడ్ లైన్ ల్లే కనిపిస్తున్నాయి. ఒక పక్క తెలంగాణ వేడి, మరొపక్క సమైకాంద్ర సెగ, ఇప్పుడు ఎర్రదండు కరెంట్ షాక్ లతో సర్కార్ సమస్యలతో సతమతమవుతుంది. ఈ సమస్యలను సర్కారు ఎలా బయటపడుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more