రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పితాని సత్యనారాయణ తీవ్రమైన స్థాయిలో బ్లాక్ మెయిల్ చేయవద్దని వేడుకున్నారు. ఈనెల 31లోపు మీకు డబ్బులు మీకు అందుతాయి? అప్పటిదాక ఆగలేరా? ప్రతి సంవత్సరం ఈ నెల 31 లోపే కదా మీకు చెల్లింపులు చెల్లించేది, అంతేగానీ ఇలా బ్లాక్ మెయిల్ చేయటం మంచికాదని ఆయన అన్నారు. మంత్రికి ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. ఆ విషయం ఆయన బాగా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ను పారదర్శకంగా చెల్లిస్తుందన్నారు. అయితే కళాశాలల యాజమాన్యాల కొత్త పాలకవర్గం తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం బాధాకరమన్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో పేద విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయడం సరికాదన్నారు. మీడియాలో వచ్చిన ప్రకటనల గురించి స్పందించాల్సిం దిగా తన బాధ్యత అంటూ కొన్ని కళాశాలల పాలకవర్గ సంఘం ఆవేశపూరితంగా విద్యార్థులను ఆందోళనకు గురిచేసే విధంగా మాట్లాడటం సమాజం హర్షించద న్నారు. నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువా లన్న ఉద్దేశం, వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సుమారు 26లక్షల మందికి పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ అందిస్తున్నామన్నారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం తమ ఉనికిని కాపాడుకునేందుకు 21లోగా చెల్లించకపోతే మూసివేస్తామని డెడ్లైన్ పెట్టడం మంచిది కాదన్నారు. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం సరి కాదన్నారు. ఇప్పటికీ కూడా 50శాతం కళాశాలలు యుటిలిటీ దృవపత్రాలు అందించలేదన్నారు. తప్పువారిది పెట్టుకొని తీరా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం, పేదలను ఆందోళనకు గురిచేయవద్దని హెచ్చరించారు. రూ.334కోట్ల నుంచి నేడు రూ.4వేల కోట్లు విడుదల చేస్తున్నామని, ప్రభుత్వం ఎప్పుడూ డబ్బులు ఎగ్గొట్ట లేదన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 31లోపు నిధులు విడుదల చేస్తున్నదని, ఈ ఏడాది కూడా ఇందుకు సంబంధించిన ఫైలును ఆర్థికశాఖ ఆమోదంతెలిపిన విషయాన్ని దృష్టిలోపెట్టుకొని డెడ్లైన్ విధించారని ఆరోపించారు. ఈ ఏడాది కూడా రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.1500కోట్లు విడుదల చేసేందుకు ఆర్థికశాఖ సమ్మతించిందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more