ఢిల్లీ లో గ్యాంగ్ రేప్ పై విద్యార్థులను చేసిన ఆంధోళనకు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఒక పేరు పెట్టారు. ఇండియా గేట్ నిరసన తెలిపిన విద్యార్థులందరు మావోయిస్టులు అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు ఆయుధాలు లేకుండా ఉద్యమం చేశారు. అదే మావోయిస్టులు అయితే ఆయుదాలతో ఉద్యమం చేస్తారని షిండే వ్యాఖ్యానించారు. ఢిల్లీ అత్యాచార ఘటనపై రాజకీయ నాయకత్వం ఉక్కిరిబిక్కిరి అవుతూంటే కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మరో సంచలనానికి తెర లేపారు. దేశంలో మహిళల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామమని చెప్పిన ఆయన ఆందోళనకారులు చేసిన అన్ని డిమాండ్లను ఒప్పుకున్నామని వెల్లడించారు. అయినా తమకు న్యాయం కావాలంటూ వారు డిమాండ్ చేయడాన్ని ప్రస్తావించిన ఆయన ‘ఇంకే న్యాయం చేయాలి..దేనికైనా ఓ పరిమితి ఉంటుంది’అని అన్నారు. అలాగే మావోయిస్టులతో ఆందోళన కారుల్ని పోల్చే అర్ధంలో వ్యాఖ్యానం చేశారు. ‘ఆందోళన జరుగుతున్న ఇండియా గేట్ వద్దకు వెళ్లి మాట్లాడాలని హోం మంత్రిని కోరడం చాలా తేలిక. రేపు కాంగ్రెస్, బిజెపిలు ఉద్యమిస్తాయి. ఆ తర్వాత మావోయిస్టులు వచ్చి ఆయుధాలతో ప్రదర్శన జరుపుతారు’అని షిండే పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ పాత్రను అర్ధం చేసుకోవాలని, ప్రభుత్వం ఎక్కడికంటే అక్కడికి వెళ్లలేదని అన్నారు. విద్యార్ధుల ఉద్యమాన్ని మావోల ఉద్యమంతో పోలుస్తున్నారా అన్న ప్రశ్నకు ‘శాంతి భద్రతల పరిరక్షణ కోణంలో ఈ రెంటినీ వేరుచేయలేం. ఉద్యమం మొదలైనప్పటి నుంచీ ఇదే విషయాన్ని నేను చెబుతూనే వస్తున్నాను’అని జవాబిచ్చారు. ఇండియా గేట్ వద్ద జరిగిన హింసాత్మక ఘటనల వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయని, దానిదై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
అంతేకాంకుడా ఢిల్లీ పోలీసు కమిషనర్ సహా ఈ ఘటనకు బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. ఆందోళన కారులపై పోలీసు చర్యను షిండే పూర్తిగా సమర్థించుకున్నారు. ‘‘ రాష్ట్రపతి భవన్ దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ. ఆందోళనకారులు రాష్ట్రపతి భవన్ కు దూసుకెళితే.. ఆ తర్వాత మీరు నన్ను విమర్శిస్తారు. అందుకే మేమంత కఠినంగా ఉన్నాం’’ షిండే తెలిపారు. అయితే ప్రజలు శాంతియుతంగా ఆందోళనలు జరపవచ్చని, కానీ అందుకు రాష్ట్రపతి భవన్ వేదిక కారాదని స్పష్టం చేశారు. ఆందోళనలపై స్పందించడంలో జాప్యం జరిగిందని ప్రశ్నించగా ..సోనియా, మన్మోహన్ తనతో చర్చిస్తూనే ఉన్నారని తెలిపారు. అయితే, హోం మంత్రి తమను మావోయిస్టులతో పోల్చడాన్ని విద్యార్థులు, ఆందోళనకారులు, తీవ్రంగా ఖండించారు. షిండే వ్యాఖ్యలు విచారకరమని ఆమ్ ఆద్మీ పార్ట నేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాగా, విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూనే ఉద్యమంలోకి అసాంఘిక శక్తులను జొరబడనివ్వద్దని వారు వస్తే ఉద్యమానికే మచ్చ వస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిది రషీద్ అల్వీ వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more