ఈ రోజుల్లో ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులున్నవారికి నెలకు 600 వందలు సరిపోతాయని ఒక ముఖ్యమంత్రి అంటున్నారు. 600 వందల రూపాయాలతో ఆ ఐదుగురు కుటుంబ సభ్యులు నెల మొత్తం బతికేయొచ్చునని ఆ ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఇటీవల ఒక వ్యక్తి రోజు గడిపేందుకు రూ. 25 లు చాలని ప్రణాళికా సంఘం అధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లులియా అన్న మాటలు ఇక దేశ ప్రజలకు గుర్తున్నాయి. అయితే అతని కంటే ఒక అడుగు ముందుకేసి ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి 600 వందల రూపాలయు చాలా ఎక్కువేనని తెల్చిపారేశారు. ఆ 600 వందలతో బియ్యం, పప్పులు, గోధుములు, ఇంత తదితర వస్తువులు నెలకు సరిపోయే వాటిని కొనుగోలు చేసుకోవచ్చునని ఆ ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఆ ముఖ్యమంత్రి కి పేద కుటుంబాలు అంటే ఎంతో ప్రేమ అని చెబుతుంది. వారి కోసమే ఈ 600 రూపాయలు పథకమని ఆ ముఖ్యమంత్రి నవ్వుతూ చెబుతుంది. ఇంతకీ ఆముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్. 600 వందల రూపాయాలతో ఐదుగురు సభ్యులున్న పేద కుటుంబం నెలపాటు నిశ్చితంగా గడిపేయవచ్చునన ఆమె అంటున్నారు. ఆమె అనటానికి కారణం ఉంది. ఇటీవల యూపీఏ ప్రభుత్వం నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ పథకం జనవరి నుండి అమలులోకి వస్తున్నట్లు యూపీఏ ప్రభుత్వం చెబుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి షిలా దీక్షిత్ ఆహారభద్రత పథకంలో యూపీఏ ప్రభుత్వం అమలుపరుస్తున్న విధానాలతో పేదవాడి ఆకలి తీరడం ఏంతో సులభమవుతోందని ఆమె అన్నారు. అన్నశ్రీ యోజనా పథకం కింద నెలకు రూ. 600 లను నేరుగా పేదవారి బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తాయని , వాటి ద్వారా తమకు అవసరమైన నిత్యావసర సరుకులను వారు సులభంగా కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చెప్పిన సంగతులు వందేళ్ల క్రితానివై ఉంటాయని ఆ పార్టీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఎద్దేవా చేశారు. అయితే ఈ రోజుల్లో ఒక రోజు భోజనం కూడా 600 వందల రూపాయలకు రావడం లేదన్న విషయం అందరికీ తెలిసిందేనని బీజేపీ నాయకులు అన్నారు. అయితే ఢిల్లీ ముఖ్మమంత్రి పేదలను అవమానించటానికే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు బీజేపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి సమాజంలో ఉన్న పరిస్థితులు తెలిసి మాట్లాడారో, లేక తెలియాక మాట్లాడారో అన్ని ఆ పెలుమాళ్ళకే తెలియాలి..
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more