ఇటీవల దగ్గుబాటి వారికి నారా వారి మద్య ఎన్టీఆర్ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు పై పురందేశ్వరి దంపతులు ఇద్దరు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు పురందేశ్వరికి లేఖ రాసి.. వివాదం మరింత రేపినట్లు తెలుస్తోంది. ఈ వివాదానికి తెర దించటానికి రంగంలో చంద్రబాబు బావమరిది రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నటుడు బాలయ్య తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావుపై మండిపడినట్లు తెలుస్తోంది. చంద్రబాబును దోషిగా నిలబెట్టేందుకు పురందేశ్వరి చేసే ప్రయత్నం సరికాదని బాలయ్య అన్నారు. పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన పై బాలయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాల స్థాపనకు క్రుషిచేసిన ఘనత టీడీపీదేనని , ఎన్టీఆర్, చంద్రబాబుల సమర్థత వల్లే కాంగ్రెస్ ఆధిపత్యానికి గండిపడిందని బాలయ్య ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రంలో వీపీ సింగ్, గుజ్రాల్, దేవెగౌడ ప్రభుత్వాల ఏర్పాటుకు ఎవరు చేశారని ఆయన ప్రశ్నించారు. బాలయోగి స్పీకరుగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు టీడీపీ అనుమతి తీసుకుందని , ఎన్టీఆర్ తో పాటు అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ లో ఏర్పాటు చేయాలని టీడీపీ కోరింది బాలయ్య తెలిపారు.
తెలుగు జాతికి మేలు చేసిన ఎన్టీఆర్ ని వైఎస్ తో పోల్చడమా ఇన్నాళ్లు మీరు చేసిందని దగ్గుబాటి దంపతులపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున విగ్రహం ఇచ్చేందుకు వైఎస్ సానుకూలంగా స్పందించలేదని , పురంధేశ్వరి సంతకం కోసం తాను ప్రయత్నిస్తే ఆమె దొరకకుండా తప్పించుకున్నారని బాలయ్య ఆరోపించారు. పురంధేశ్వరితో మూడు సార్లు ఫోన్లో మాట్లాడిన గడువు ముగిసేవరకు కాలయాపన చేశారని బాలయ్య తెలిపారు. కుటుంబ సభ్యులంతా ఇచ్చిన లేఖను కాదని, ఆమె ఘనతగా చెప్పుకోవడమేంటని బాలయ్య ప్రశ్నించారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో చంద్రబాబుకు వేరే ఉద్దేశాలు లేవని బాలయ్య తెల్చి చెప్పారు. బాలయ్య ప్రకటనతో దగ్గుబాటి దంపతులు షాక్ తిన్నట్లు తెలుస్తోంది. బావ పై మాట పడకుండా బాలయ్య భలే సపోర్టు చేశాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. బాలయ్య వెనక చంద్రబాబు స్ర్కిప్టు ఉందని దగ్గుబాటి అభిమానులు అంటున్నారు. ఏమైన బాలయ్య ప్రకటనతో మూడు కుటుంబల మద్య వివాదం పెరుగుతుందని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. బాలయ్య ప్రకటనకు దగ్గుబాటి దంపతులు ఎలాంటి సమాదానం ఇస్తారో చూడాలి?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more