లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ రాజకీయాలకు అతీతంగా ప్రారంభమైన ‘సురాజ్య’ ఉద్యమంలో కీలక ఘటానికి రాజధానిలో తెరలేపారు. సురాజ్య ఉద్యమ స్టీరింగ్ కమిటీ కన్వీనర్, జయప్రకాష్ నారాయణ్ మూడు రోజులపాటు నిరాహారదీక్ష చేయనున్నారు. అవినీతి అంతం, సుపరిపాలనతో మెరుగైన సమాజం లక్ష్యంగా ప్రజల్ని చైతన్యం చేసే దిశగా ఆయన ఈ దీక్ష చేపడుతున్నారు. ఆగస్టు 9న ప్రారంభమైన తొలిదశ సురాజ్య ఉద్యమం ఇప్పటివరకు 90 పట్టణాల్లో నిర్వహంచిన రౌండ్ టేబుల్ సమావేశాలతో దాదాపు 15 వేలమంది మేథావులు, యువకులు, నేతలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధుల ధ్రుష్టిని ఆకర్షించింది. లక్షన్నరమంది విద్యార్థుల్ని చైతన్యపరచింది. అవినీతికి వ్యతిరేకంగా, సుపరిపాలన లక్ష్యంగా సాగుతున్న ఈ ఉద్యమానికి, జేపీ దీక్షకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అందరికీ మంచి విద్య, వైద్యం అందించడం.. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో పౌర సేవల్ని హక్కుగా సకాలంలో అందించడం..దామాషా పద్దతిలో ఎన్నిక విధానం ఉండాలనేది ఉద్యమ లక్ష్యాలు. పెచ్చుమీరుతున్న అవినీతిని నిరోధించడానికి బలమైన లోకాయుక్త చట్టం కోసం లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ జేపీ మూడేళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. అవినీతికి పాల్పడ్డవారి ఆస్తుల్ని జప్తు చేసేలా బలమైన లోకాయుక్త బిల్లు ( అవినీతి నిరోధక చట్ట సవరణ)ని రూపోందించి 2009 లోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. శాసనసభ స్పీకర్ కు , వివిధ రాజకీయ పార్టీలకు అందించి అవినీతిని అంతం చేసే బలమైన లోకాయుక్త చట్టం కోసం పోరాటం చేస్తున్నారు.
సురాజ్య ఉద్యమ డిమాండ్లలో ఇది ప్రధానమైన డిమాండ్ గా ఉంది. సురాజ్య ఉద్యమ డిమాండ్లపై కొద్ది రోజల క్రితం సీఎంని కలిసిన సమయంలో కూడా లోకాయుక్త బిల్లుతో పాటు ప్రభుత్వ సేవల్ని హక్కుగా పొందే చట్టం బిల్లుని సురాజ్య ఉద్యమ సారధ్య కమిటీ అందించింది. ఈ మూడు రోజుల పాటు జరిగే దీక్ష సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సురాజ్య మార్చ్ లు నిర్వహించాలని, దీక్షలు చేపట్టాలని స్వచ్చంద సంస్థలు , విద్యార్థులు, పార్టీలు, ప్రముఖులకు సురాజ్య సారధ్య సంఘం ఒక సందేశం తెలిపింది. ఈ రోజు అవినీతిని అంతమొదించడమే లక్ష్యంగా లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఇందిరా పార్కు వేదికగా సురాజ్య ఉద్యమ, జనచైతన్య దీక్షను ప్రారంభించారు. ఇందులో భాగంగా 72 గంటల పాటు జేపీ నిరశన దీక్ష చేపట్టనున్నారు. సురాజ్య ఉద్యమ లక్ష్యాలు అమలై సామాన్యుడు ప్రభువు కావాలనే ఉద్దేశంతో తలపెట్టిన ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాల్సిందిగా జేపీ కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more