నేటితో నవంబర్ నెల ముగుస్తుంది.... రేపటి నుండి డిసెంబర్ 1వ తేదీ ప్రారంభం అవుతుంది. డిసెంబర్ ప్రారంభం అవుతుందంటేనే కొన్ని గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎందుకంటారా ? 2012 డిసెంబర్ 21న యుగాంతం వస్తుందనేది వాళ్ళ ప్రధాన భయం. డిసెంబర్ 21 తరువాత భూమి పై ఓ ఒక్క జీవరాశి లేకుండా అంతరించి పోతుందని, మాయన్ కేలండర్ డిసెంబర్ 21తో ముగుస్తుండంతో యుగాంతం తప్పదని చాలా మంది భయపడుతున్నారు. ఒక్క క్షణం కళ్లు మూసుకోండి. గాలిని గట్టిగా లోపలికి తీసుకుని వదిలేయండి. మీకు ఒక మంచి వార్త. ఈ డిసెంబర్ 21తో ప్రపంచం అంతరించిపోదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) శాస్త్రవేత్తలు హామీ ఇవ్వడమే కాకుండా, మన భూ గ్రహం మరో 400 కోట్ల సంవత్సరాలు నిక్షేపంగా ఉంటుందని నాసా తన వెబ్సైట్లో ప్రపంచ ప్రజలకు తెలియజేసింది.
నాసా శాస్ర్తవేత్తలు గట్టిగా చెప్పేదేంటంటే.... ప్రాచీన మాయన్ కేలండర్లో ఒక చక్రం ముగిసే 2012 డిసెంబర్ 21వ తేదీకి ముడివేసి.. ఆ రోజుతో ప్రపంచం అంతరించి పోతుందని అనుకుంటున్నారు. యుగాంతం కథలో ‘నిబిరు అనే గ్రహం భూమి వైపుగా దూసుకు వచ్చి ఢీ కొడుతుందని ఉంది. కానీ ఇది 2003 లో వస్తుందని అంచనా వేశారు. కానీ అది రాలేదు. "ఒక ఏడాదికి సంబంధించి మన కేలండర్ డిసెంబర్ 31తో ముగుస్తుంది. మళ్లీ కొత్త సంవత్సర కేలండర్ జనవరి 1 నుంచి మొదలవుతుంది. అలాగే మాయన్ కేలండర్ కూడా 2012 డిసెంబర్ 21 తర్వాత మళ్లీ తిరిగి ప్రారంభమవుతుంది'' అంటూ నాసా శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
భూమి పై ఎన్నో ఆవిష్కరణలు, ప్రయోగాలు చేస్తూ కొత్త కొత్త విషయాలు కనుక్కునే శాస్ర్తవేత్తలు భూమికి ఏదైనా ముప్పు ఉంటు పది సంవత్సరాల ముందే అంచనా వేస్తారు. కానీ అలాంటిది ఏమీ లేదని, ఇదంతా అసత్య ప్రచారం అని నాసా శాస్ర్తవేత్తలు వివరిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఎన్ని చెప్పినా, ప్రజల నమ్మకాలు ప్రజలు. కాబట్టి డిసెంబర్ 21న ఏం జరుగుతుందో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more