మొన్న చంచల్ గూడ జైలుకు వెళ్లిన మోపిదేవిన కలిసి వచ్చిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మనసు మారింది. జైల్లో కన్నా ఎవర్ని కలిశారో తెలియదు గానీ.. మొత్తం మీద సారు మనసు మారింది. వైఎస్ మా నాయకుడే గానీ, ఆయన కుటుంబ అవినీతితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని'' వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా రేపల్లెలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ తమ పార్టీ నాయకుడేనని, ఆయనకు, జగన్కు ఉన్నది తండ్రీకొడుకుల అనుబంధమే తప్పించి రాజకీయ వారసత్వం లేదన్నారు. జగన్, ఆయ న కుటుంబసభ్యులు లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డట్లు సీబీఐ గుర్తించినందునే ఆయనపై కేసులు నమోదు చేసిందన్నారు. పదవీ వ్యామోహంతో వైఎస్ బొమ్మను పెట్టుకుని జగన్ జనాన్ని మోసం చేస్తున్నాడన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more