దాదాపు 35 మంది ఖైదీల మరణ శిక్షలను ఒక్క కలం పోటుతో యావజ్జీవ శిక్షలుగా మార్చేశారు. మరణ శిక్షలు తప్పిన వారిలో మూకుమ్మడి హత్యలు చేసిన వారూ, కిడ్నాపింగ్లకు, అత్యాచారాలకు పాల్పడినవారూ, పిల్లలను హత్య చేసినవారూ ఉండడం గమనార్హం. ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో రాష్ట్రపతి ఇలా క్షమాభిక్ష ప్రసాదించడం సర్వత్రా విస్మయాన్ని కలిగించింది. ఇలాంటి క్షమాభిక్షలు న్యాయ, చట్ట నిబంధనలను దొడ్డిదారిగుండా నీరుగారుస్తున్నాయా? అన్న సందేహానికి తావిస్తున్నాయి. రాష్ట్రపతి భవన్ ప్రతినిధి అర్చనా దత్తా దీనిపై మాట్లాడుతూ, రాష్ట్రపతి స్వయానా లాయర్ అయినందున ఆమెకు రాజ్యాంగ నిబంధనలన్నీ తెలుసన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సలహాతో సంతృప్తి చెందితేనే ఆమె మరణశిక్షను మార్చడమా లేక తిరస్కరించడమా అనే నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పారు. దత్తా ఇలా చెప్పినప్పటికీ, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ వ్యవహార శైలి చాలా తొందరపాటు చర్యగా ఉందనిపిస్తోంది. చాలా దారుణమైన, నీచాతినీచమైన కిరాతకాలకు పాల్పడిన వారికి ఇలా క్షమాభిక్ష లభించింది. కచ్చితంగా మరణశిక్ష పడాల్సిన అత్యంత అరుదైన నేరాలకు పాల్పడిన కేటగిరీలో వీరున్నారు.
అలా మూకుమ్మడిగా చేసిన దారుణాలకు పాల్పడినవారి పట్ల దయతో వ్యవహరించిన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, రాజకీయ హత్యల విషయంలో మాత్రం అలా వ్యవహరించలేకపోయారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ లేదా రాజీవ్ గాంధీ హంతకుల విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. జూన్ రెండో తేదీన ఆమె మరో నాలుగు క్షమాభిక్షలు మంజూరు చేశారు. అంతకుముందు రాష్ట్రపతుల విషయానికొస్తే కెఆర్ నారాయణన్ వద్దకు పది పిటిషన్లు రాగా కేవలం ఒక్కదాన్నే పరిష్కరించగలిగారు. అబ్దుల్ కలాంకు మిగిలిన తొమ్మిది పిటిషన్లు వారసత్వంగా రాగా, మరో 16 పిటిషన్లు ఆయన హయాంలో వచ్చాయి. అంటే మొత్తం పిటిషన్ల సంఖ్య 25కి చేరాయి. కానీ ఆయన పరిష్కరించగలిగింది రెండు మాత్రమే. ఒకదాన్ని తిరస్కరించగా, రెండోదానికి క్షమాభిక్ష మంజూరు చేశారు. రాజ్యాంగంలో 72వ అధికరణం కింద రాష్ట్రపతికి ఈ హక్కు కల్పించ బడింది. మొత్తం 35 మందికి క్షమాభిక్ష ప్రసాదించగా, మూడింటిని తిరస్క రించారు. పెండింగ్లో ఉన్న వాటిలో అఫ్జల్ గురు పిటిషన్ కూడా ఉంది. పదవి నుంచి వైదొలగడానికి ముందుగా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సరికొత్త రికార్డు సృష్టించారు
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more