భారత్లో హృద్రోగాలతో ఆకస్మిక మరణాలు (ఎస్సీడీ) గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దరిమిలా భారత్ ప్రపంచంలోనే అత్యధిక హృద్రోగులు కలిగివున్న దేశంగానూ మారుతోందన్న గణంకాలు వెలువడుతున్నాయి. సాప్ట్ వేర్ ఉద్యోగాలు, జంక్ ఫుడ్, వ్యాయామాలు లేకపోవడం.. రాత్రిళ్లు ఎక్కువ సమయం నిద్రపోడం వంటి అలవాట్లతో దేశంలోని యవత, మధ్యవయస్సులు అధికంగా హృద్రోగాలకు గురవుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మరణాల్లో అధికంగా యువత, మధ్య వయస్కులు ఉంటుండటం కలవరం కలిగిస్తోంది.
తీవ్ర హృద్రోగాల ప్రమాదం గురంచి యువతే కాకుండా స్కూల్ విద్యార్ధుల్లోనూ అవగాహన కల్పించాలని 5 వేల మందికి పైగా డాక్టర్లతో కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఐ) ప్రచార కార్యక్రమం నిర్వహించింది. భారత్ ప్రస్తుతం ప్రపంచ హృద్రోగ క్యాపిటల్గా మారిందని సీఎస్ఐ కన్వీనర్ (ప్రివెంటివ్ కార్డియాలజీ కౌన్సిల్) డాక్టర్ రాజీవ్ గుప్తా పేర్కొన్నారు. కాలుష్యం, డిప్రెషన్, ఎక్కువసేపు స్క్రీన్లపై గడపడం, చక్కెర వాడకం పెరగడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలతో హృద్రోగ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. ప్రజల జీవన శైలిలో మార్పులతోనూ భారత్లో గుండె జబ్బులు పెరిగాయని అన్నారు.
శారీరక వ్యాయామం కొరవడటం, కార్బోహైడ్రేట్లు అధికంగా తీసుకోవడం ముప్పు కారకాలుగా ఉన్నాయని సీఎస్ఐ గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దేవవ్రత రాయ్ వివరించారు. మద్యపానం తీసుకునేవారు పెరుగుతున్నారని, ఫాస్ట్ ఫుడ్ చైన్స్ పెరగడం అవి కొవ్వులు, ఉప్పు, చక్కెర పరిమితులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలను పాటించకపోవడం హృద్రోగాలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటితో పాటు నిరుద్యోగం, పేదరికం వంటి సామాజిక అసమానతలు పేదల్లో కుంగుబాటుకు ప్రేరేపిస్తూ ఆపై తీవ్ర హృద్రోగాలకు దారితీస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more