Goddess blesses devotees in Sri Gayatri Devi avatar ఇంద్రకీలాద్రిపై గాయత్రి దేవిగా కనకదుర్గమ్మ..

Goddess blesses devotees in sri gayatri devi avatar on day 3 of dasara festivities

Dussehra Navaratri celebrations, Indrakeeladri, Godess Kanaka Durgamma Devi as Sri Gayatri Devi, Third Day of Durga Sarannavaratrulu, Sri Gayatri Devi history, Navaratri 3nd day Sri Gayatri Devi, Sri Bala Tripura Sundari Devi, Sri Chakra, Sri Yantra pooja, Tirpura Traya, Kanaka Durga Devi Ammavaru, Sri Swarna kavachalankrutha Durga Devi, Vijayawada, Andhra Pradesh

Hill atop shrine Indrakeeladri diety Kanakadurgamma is blessing the devotees in Sri Gayatri Devi Avatar on the Third day of the nine-day Dussehra Navaratri celebrations. Kanaka Durgamma Devi Sharannavaratrulu whic began 26th Sepetember, will end on October 5 at the Indrakeeladri Ammavari Temple in Vijayawada.

దేవీశరన్నవరాత్రులు 3వ రోజు: గాయత్రి దేవి అవతారంలో కనకదుర్గమ్మ..

Posted: 09/28/2022 11:38 AM IST
Goddess blesses devotees in sri gayatri devi avatar on day 3 of dasara festivities

విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ తొమ్మిది రోజలు పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తలకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. దేవి శరన్నవరాత్రులు అక్టోబర్‌ ఐదో తేదీ వరకు కొనసాగుతాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది.

తొలిరోజు దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా కనకదుర్గమ్మ దేవీ భక్తులను అనుగ్రహించగా, రెండవ రోజూన బాలత్రిపుర సుందరి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. ఇక మూడవ రోజున కనకదుర్గమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రులలో మూడొవ రోజు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్నారు. గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపఈ రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.

అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింపబడుతుంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. శ్రీ ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది. నవరాత్రులలో మూడవ రోజు నారింజ రంగు(ఆరెంజ్) దుస్తులు ధరించి, అమ్మవారిని ఉపాసన చేసి, అల్లపు గారె నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రి స్తోత్రాలను పారాయణ చెయ్యాలి.

ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః
ర్యుక్తామిందు నిబద్దరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళం హస్తైర్వహం తీం భజే  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles