బాలీవుడ్ బాద్ షాగా ఖ్యాతి గడించిన నటుడు షారూఖ్ ఖాన్కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2017లో నమోదైన కేసును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.. షారుఖ్ ఖాన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ ను కొట్టివేసింది. వడోదర తొక్కిసలాట కేసు నుంచి షారుఖ్ ఖాన్ ను విముక్తుడ్ని చేసింది. దీంతో షారుఖ్ ఖాన్ అభిమానులు ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. 2017లో షారుఖ్ ఖాన్ నటించిన ‘రాయిస్’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన తన చిత్రబృందంతో కలిసి ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన వస్తున్న సమాచారం అందుకున్న అభిమానులు తమ అభిమాన నటుడిని చూసేందుకు వడోదర రైల్వే స్టేషన్కు పోటెత్తారు. ఇసుక వేసినా రాలనంత పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులను చూసిన షారూఖ్ వారి ప్రేమ, అదరాభిమానాలతో పొంగిపోయాడు. వారికి తన తన చిత్రం తరపున ఏమైనా ఇవ్వాలని భావించి వారిపై టీషర్టులు, స్మైలీ బాల్స్ విసిరారు. వీటిని చేజిక్కించుకునే ప్రయత్నంలో రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది.
రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు షారూఖ్ ఖాన్ కారణమయ్యారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జితేంద్ర మధుబాయ్ సోలంకి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును కొట్టివేయాల్సిందిగా కోరుతూ షారూఖ్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్లో కేసును విచారించిన కోర్టు షారూఖ్కు అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, గుజరాత్ హైకోర్టు తీర్పును ఫిర్యాదుదారుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిని విచారించిన జస్టిస్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం షారూఖ్కు అనుకూలంగా తీర్పు చెప్పింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more