మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న ఉప-ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమై తమ స్థానాన్ని తిరిగి నిలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే.. పార్టీ శ్రేణులు కూడా అందుకు అనుగూణంగా శ్రమిస్తున్నారు. కాగా ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా, కార్యకర్తలను ఉత్తేజపర్చే విధంగా ప్రకటనలు చేయాల్సిన నేతలు.. నిరుగార్చేలా ప్రకటనలు చేస్తున్నారు. మరో ఏడాదిన్నర సమయంలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.
ఆయన చేసిన ఈ ప్రకటన కాంగ్రెస్ కార్యకర్తలను నిరుత్సాహంలోకి వెళ్లేలా చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. తన స్థానంలో సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తల్లోంచి చక్కని, చురుకైన వ్యక్తిని ఎంచుకుని ఆయనను బరిలోకి దించుతానని ఆయన ఆసక్తికర ప్రకటన చేశారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో భాగంగా ఉన్న సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. గెలిచిన తనకు అప్పటి నుంచి తన వెన్నంటే ఉండి అహర్నిషలు తనతో కొనసాగిన కార్యకర్తలకు రానున్న ఎన్నికలలో అవకాశం కల్పిస్తానని ప్రకటించారు.
తన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తలు అంగీకరించని పక్షంలోనూ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోబోనని చెప్పారు. అయితే కార్యకర్తలు అభీష్టం తన నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్న పక్షంలో తన భార్య నిర్మలతో కలిసి బుధవారం పార్టీ కార్యకర్తలతో భేటీ అయిన సందర్భంగా జగ్గారెడ్డి ఈ ప్రకటన చేశారు. తనకు బదులుగా సంగారెడ్డికి చెందిన పార్టీ కార్యకర్తను బరిలోకి దించేందుకు పార్టీ శ్రేణులు ఒప్పుకోకపోతే... తన స్థానంలో తన భార్య చేత పోటీ చేయిస్తానని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పిన జగ్గారెడ్డి... 2028లో జరిగే ఎన్నికల్లో మాత్రం సంగారెడ్డి నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more