నర్సాపూర్ పార్లమెంటరీ సభ్యుడు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు సందర్భంగా ఆయనను టార్చర్కు గురి చేశారనీ, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. రఘురామరాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన ఈ పిటీషన్ ను దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ స్వీకరించిన సంగతి తెలిసిందే. కాగా, ఇవాళ ఈ పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలంటూ ఈ సందర్భంగా పిటిషనర్ను ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చుందుకు 2 వారాల గడువు కావాలంటూ భరత్ తరఫు న్యాయవాది ఆదినారాయణ రావు సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. కోర్టు అందుకు సమ్మతిస్తూ విచారణను వాయిదా వేసింది. కాగా, అంతకుముందు ఈ పిటీషన్ విచారణ సందర్భంగా భరత్ తరఫు న్యాయవాది ఆదినారాయణ రావు రఘురామరాజును చిత్రహింసలు పెట్టిన విషయమై పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రఘురామరాజును చికిత్స చేసిన వైద్యులపై కూడా ఒత్తిడి తీసుకువచ్చిందని తెలిపారు. దీంతో ఆయనను సికింద్రాబాదులోని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆయనకు గాయాలైన విషయాలు నిర్థారణ అయ్యాయని తేలిందని తెలిపారు.
ఈ టార్చర్ కారణంగా దాదాపుగా రెండున్నరేళ్లుగా రఘురామరాజు తన పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు ఏపీలో అడుగుపెట్టలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. కాగా, ఎంపీని రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పించిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సీఐడీ కస్టడీలోని రఘురామరాజుపై టార్చర్ జరిగిందని, ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం లేదని ఆయన వాదించారు. అయితే ఆదినారాయణరావు వాదనతో విభేదించిన సుప్రీంకోర్టు... రాష్ట్ర ప్రభుత్వ వాదన విన్న తర్వాతే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలా? వద్దా? అన్న విషయంపై దృష్టి సారిస్తామని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more