భారతదేశంలో దశాబ్దాల క్రితం బొగ్గు ఇంధనంగా రైళ్లు నడిచేవి. ఇప్పటికీ కొన్ని మార్గాల్లో అలాంటి రైళ్లు నడుస్తున్నాయి. అయితే దాదాపుగా అన్ని రైలు మార్గాలను రైల్వేశాఖ విద్యుదీకరణ చేయడంతో.. మన దేశంలో ప్రస్తుతం ఎక్కడా అప్పట్లో కనిపించిన దృశ్యాలు ఇప్పుడు కనపించవు. కాగా, ఆప్పట్లో మన దేశంలో కనిపించిన దృశ్యాలు ఇప్పటికీ బంగ్లాదేశ్ రైళ్లలో దర్శనమిస్తున్నాయి. ఇంతకీ ఆ దృశ్యాలు ఏంటా అని అంటారా.? ఫ్యాసింజర్ రైళ్లలో జనం కిక్కిరిపోయి.. కాలు పెట్టేంత స్థలం కూడా లేకపోవడమే. అదేంటీ ఢిల్లీ, ముంబై మెట్రో రైళ్లలోనూ అలాంటి దృశ్యాలు దర్శనమిస్తుంటాయి కదా..? అంటారా..
అయితే రద్దీ గురించి కాదు మనం ఇక్కడ ప్రస్తావిస్తున్న విషయం.. రైళ్లు రద్దీగా ఉన్నప్పుడు ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు సహసంతో కూడాన ప్రయాణం చేయడం గురించి. అదేంటి అంటే.. మనం మాట్టాడుతున్నది ఏకంగా రైలు బోగిపైకి ఎక్కి ప్రయాణాలు చేసే దృశ్యాల గురించి. సర్వసాధారణంగా బంగ్లాదేశ్ లోని ప్యాసింజర్ రైళ్లు,, ఎప్పుడు చూసినా జనం రద్దీ కనిపిస్తుంటుంది. రైలు బోగీల్లోకి ఎక్కేందుకు ఒకరినొకరు తోసుకోవడం, కొట్లాడుకునే వీడియోలు సోషల్మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్నాయి. కొందరు ఫుట్బోర్డుపై వేలాడుతూ అతి ప్రమాదకరంగా వెళ్తుంటే, మరికొందరు రైలు బోగీపైన ఎక్కి ప్రయాణిస్తున్నారు.
కాగా, రైలులో సీట్లు దొరక్కపోవడంతో ఓ మహిళ బోగీపైకి ఎక్కేందుకు నానా తంటాలు పడింది. ఈ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. బంగ్లాదేశ్లోని ఓ స్టేషన్లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఆగి ఉంది. రైలు మొత్తం జనాలతో నిండిపోయింది. దీంతో చాలామంది బోగీపైకి ఎక్కి కూర్చున్నారు. ఓ మహిళ పైకి ఎక్కేందుకు ప్రయత్నించినా విఫలమైంది. నానా తంటాలు పడింది. చివరకు రైల్వే పోలీసులు వచ్చి ఆమెను వారించడంతో అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ షాకింగ్ దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఇలా బోగీపై ప్రయాణించడం క్రిమినల్ నేరం కాదా? అని నెటిజన్లు ప్రశ్నించారు. ఈ సన్నివేశం ‘గదర్ ఏక్ ప్రేమ్కథ’ చిత్రాన్ని గుర్తుచేసిందని ఒక యూజర్ కామెంట్ చేశారు.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more