మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎవరో మంత్రగాడు చెప్పాడని.. మగ సంతానం కోసం తన భార్యతో పబ్లిక్లో స్నానం చేయించాడో భర్త. బాధితురాలి అత్తామామలు బలవంతంగా తమ కొడుకును వత్తిడి చేయడంతో ఆయన తన భార్య గౌరవమర్యాదలను మంటగలుపుతూ దారుణానికి ఒడిగట్టాడు. అర్థేచ, కామేఛ, అంటూ పెళ్లినాడు చేసిన ప్రమాణాలను తుంగలో కలుపుతూ.. తన భార్య మానప్రాణాలకు తానే అండగా నిలవాల్సిన భర్తే.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆడ, మగ ఇద్దరూ సమానమేనని అనేక ఘటనల్లో మహిళలు నిరూపిస్తున్నా.. ఇంకా మగబిడ్డ కోసం ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడటం.. సంచలనంగా మారింది.
మగబిడ్డ సంతానం కలగాలంటే ఇలా చేయాలని ఓ మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి.. వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. పుణెకు చెందిన ఓ మహిళకు.. 2013లో ఓ వ్యాపారవేత్తతో పెళ్లి జరిగింది. అప్పటి నుంచి భర్త, అత్తమామలు ఆమెను చిత్రహింసలకు గురిచేస్తూనే ఉన్నారు! కొన్నేళ్ల క్రితం.. ఆ మహిళ నగలను తాకట్టు పెట్టి రూ. 75లక్షలు లోన్ తీసుకున్నాడు ఆ భర్త. అంతేకాకుండా.. తన పుట్టింటి ఆస్తులను కూడా లాగేసుకున్నాడు. తన సంతకాన్ని అతను ఫోర్జరీ చేసినట్టు బాధితురాలు చెప్పింది. అలా వచ్చిన డబ్బుతో మరో వ్యాపారం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి.
అయితే.. ఈ మధ్యకాలంలో కొల్హాపూర్లో క్షుద్రపూజలు చేసే మౌలానా బాబా జమదార్ మాంత్రికుడిని కలిశాడు ఆ భర్త. 'వ్యాపారంలో లాభాలు రావడానికి' అంటూ.. కొన్ని పూజలు చేయించాడు. 'నీకు మగ బిడ్డ పుట్టాలంటే.. నీ భార్యను ఓ జలపాతానికి తీసుకెళ్లి.. పబ్లిక్లో స్నానం చేయించూ,' అని ఆ వ్యాపారికి ఆదేశాలిచ్చాడు ఆ మాంత్రికుడు. ఆ మాటలు నమ్మని భర్త, అతని తల్లిదండ్రులు.. ఆ మహిళను రాయ్గఢ్కు తీసుకెళ్లారు. జలపాతంలో పబ్లిక్ ముందు స్నానం చేయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళ భర్త, అత్తమామాలతో పాటు మాంత్రికుడిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more