పోలిస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో.. పోలిస్ స్టేషన్ పక్కనే.. పీఎస్ వంద మీటర్ల దూరంలో.. ఠాణాకు అత్యంత చేరువలో అంటూ ఇన్నాళ్లుగా కొన్ని వార్తలు చదివిన పాఠకులకు ఇప్పుడు పోలిస్ స్టేషన్ ఆవరణ నుంచే ద్విచక్రవాహనాన్ని చోరీ చేసిన ఘటన ఏపీలోని `విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. ఇబ్రహీంపట్నం పిఎస్ ఎదుట బండి నిలిపిన కానిస్టేబుల్ వాహనాన్ని ఓ దొంగ ఎలాంటి భయం లేకుండా తన వాహనాన్ని తీసుకెళ్లినట్లే తీసుకెళ్లడం సంచలనాన్ని సృష్టించింది. దివ్యాంగుడిలా కుంటుతూ నడుస్తూ వచ్చి ఎవరు లేకపోవడం గమనించి బండిని మారుతాళంతో తెరిచి జంపయ్యాడు.
పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి చూసిన కానిస్టేబుల్ తన బైక్ లేదని గమనించి.. వెంటనే స్థానికి సిసి టివి కెమెరాలను పరిశీలించగా, ఓ యువకుడు బండిని కొట్టేయడం కెమెరాల్లో రికార్డైంది. మాసిన దుస్తులతో కుంటుకుంటూ వెళ్తున్న ఓ యువకుడు రోడ్డు మీద పార్క్ చేసిన వాహనాన్ని సెకండ్ల వ్యవధిలో స్టార్ట్ చేసి మాయమైపోయాడు. రెండు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే చోరీ చేసి విజయవాడ మీదుగా గుంటూరు పారిపోయాడు. బేరం కుదిరితే ఆ బండి అక్కడే విడిభాగాలుగా మారిపోయేది. అయితే ఠాణా నుంచి బయటకు వచ్చిన కానిస్టేబుల్ తన వాహనం కనిపించకపోయే సరికి అంతటా వెతికి.. చివరకు సిసిటీవీ ఫూటేజీలను పరిశీలించాడు.
సిసిటివిల్లో తన ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లిన ఆగంతకుడిని పాత నేరస్థుడిగా గుర్తించిన పోలీసులు.. వెంటనే అతడి కదలికలు గుర్తించి విజయవాడ మీదుగా గుంటూరు వైపు వెళ్తున్నట్లు కనుగొన్నారు. దాదాపు 30 కిలోమీటర్ల ప్రయాణించి మంగళగిరి సమీపంలో ఉన్న నిందితుడ్ని వెంటాడి పట్టుకున్నారు. అయితే సకాలంలో స్పందించడం కారణంగానే కానిస్టేబుల్ వాహనం యథాతథ స్థితిలో లభ్యమైంది. అయితే సామాన్యప్రజల వాహనాల, ఇతర పిర్యాదులపై పోలీసులు ఇదే విధంగా వేగంగా స్పందించి.. దర్యాప్తును కొనసాగిస్తే ఎంతటి కరుడుగట్టిన దొంగలైనా ఇట్టే దొరికిపోతారనేందుకు ఇది నిదర్శనం.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వెంకటేషన్ సోమవారం మధ్యాహ్నం స్టేషన్ బయట బండి పెట్టి లోపలకు వెళ్లాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన నిందితుడు బండిని చూడగానే మాయం చేయాలని నిర్ణయించుకునే దానిపై చెక్కేశాడు. స్థానిక సీసీ టీవీల్లో చోరీ దృశ్యాలు నమోదవడంతో వెంటనే నిందితుడి అచూకీ కోసం ప్రయత్నించారు. ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వైపు బైక్ వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దారి పొడవున పోలీసులు అమర్చిన సిసిటివి కెమెరాల్లో నిందితుడి కదలికలు నమోదవ్వడంతో దొంగను పట్టుకోవడం సులువైంది.
వాహనం గుర్తుల ఆధారంగా ఏ మార్గంలో ప్రయాణించాడో పోలీసులు పసిగట్టేశారు. విజయవాడ మీదుగా మంగళగిరి జాతీయ రహదారి దాటుకుని పెదకాకాని సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ పోలీసులు గుంటూరు అర్బన్ పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో నిందితుడిని వాహనం సహా పట్టుకున్నారు. నిందితుడు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అరుంధతీ నగర్కు చెందిన నండ్రు మాణిక్యాాల రావుగా గుర్తించారు. చోరీ చేసిన వాహనాన్ని గుంటూరు ఆటోనగర్లో పాత వాహనాల విడిభాగాలు విక్రయించే వారికి అమ్మేందుకు తీసుకెళ్తుండగా దొరికిపోయాడు. పోలీసులు ఏ మాత్రం ఆలశ్యం చేసినా ముక్కలై మాయమైపోయేది. మరోవైపు నిందితుడు చోరీ చేసినా ఫలితం దక్కకపోగా ఊచలు లెక్కబెట్టాల్సి వస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more