బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి రేసులో మొన్నటిదాకా దూకుడుగా సాగిన భారత సంతతి నేత, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, ఆ దేశ ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్ తాజాగా పోటీలో బాగా వెనుకబడిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని పదవికి చివరి బరిలో నిలిచిన లిజ్ట్రస్... సునాక్ విజయావకాశాలను పూర్తిగా తన వైపునకు లాగేసుకున్నారని అక్కడి పత్రికలు విశ్లేషిస్తున్నాయి. ఫలితంగా శనివారం నాటి విశ్లేషణల ప్రకారం 90 శాతం విజయావకాశాలతో లిజ్ ట్రస్ దూసుకుపోతుంటే... 10 శాతం గెలుపు అవకాశాలతో సునాక్ సాగుతున్నారు.
పలు వివాదాస్పద నిర్ణయాలతో బ్రిటన్ ప్రధానిగా కొనసాగుతున్న బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేయగా... ఆయన స్థానంలో కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు అధికారిక కన్జర్వేటివ్ పార్టీలో క్రతువు మొదలైపోయింది. నూతన ప్రధానిని ఎన్నుకోవడంలో కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలతో పాటు ఆ పార్టీ సభ్యులు కూడా ఓటింగ్లో పాలుపంచుకోవాల్సి ఉంది. ఎంపీల్లో సునాక్కు మెజారిటీ కనిపిస్తున్నా... పార్టీ సభ్యుల్లో మాత్రం లిజ్ ట్రస్కు భారీ ఆధిక్యత కనిపిస్తున్నట్లు బ్రిటన్ బెట్టింగ్ ఎక్చేంజి సంస్థ స్మార్కెట్స్ వెల్లడించింది.
బోరిస్ కేబినెట్లో సునాక్ ఆర్థిక మంత్రిగా వ్యవహరించగా... ట్రస్ విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. వెరసి ఇప్పుడు బ్రిటన్ నూతన ప్రధాని రేసులో ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రుల మధ్య పోటీ నెలకొంది. నూతన ప్రధాని ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న ముఖాముఖి చర్చల్లో భాగంగా సునాక్పై ట్రస్ సునాయసంగా ఆధిక్యత చాటుతున్నట్లు సమాచారం. తాను అధికారంలోకి వస్తే పన్నులు తగ్గిస్తానని ట్రస్ జనాకర్షక ప్రకటన చేయగా... ప్రజలకు మంచి పాలన అందించేందుకు తాను మాత్రం పన్నులు తగ్గించబోనంటూ సునాక్ ప్రకటించారు. ఫలితంగా పార్టీ సభ్యుల్లో మెజారిటీ శాతం ట్రస్ వైపు మళ్లినట్టుగా సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more