ది బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచి ప్రజల డిపాజిట్లను పెట్టుబడులుగా మార్చినట్లు ప్రకటించింది. దీంతో అక్కడి ప్రజలు బ్యాంకుల వద్ద ఆందోళన చేపట్టారు. తాము బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును.. అవి ఏ విధంగా పెట్టుబడులుగా మార్చేస్తాయంటూ నిరసనన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తిరగబడితే వారిని నియంత్రించడానికి షాన్డాంగ్ ప్రావిన్స్లోని రిఝోలోని ఓ బ్యాంకు వద్ద రక్షణగా యుద్ధట్యాంకులు రక్షణగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. చాలా ఆంగ్ల పత్రికలు.. ఈ ట్యాంకులు బ్యాంకు రక్షణ కోసం వచ్చినవే అని కథనాలు ప్రచురించాయి.
కానీ, బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ వంటి వారు రిఝె వద్ద నౌకాదళ స్థావరం ఉండటంతో ట్యాంకులు వెళుతున్నాయనీ.. ఇది ఏటా సర్వసాధారణమే అని పేర్కొంటున్నారు. ట్యాంకుల మోహరింపు ఎలా ఉన్నా.. గ్రామీణ బ్యాంకులపై చైనా ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నది మాత్రం వాస్తవం. హెనాన్ ప్రావిన్స్లో రాజుకొన్న అగ్గి.. జులై 10వ తేదీన చైనా సోషల్ మీడియా వీబొలో కొందరు డిపాజిటర్లు గ్రామీణ బ్యాంకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు చేశారు. ఆ తర్వాత దాదాపు 1,000 మంది హెనాన్ రాజధాని జియాంగ్ఝూలో ఆందోళనలు మొదలుపెట్టారు.
హఠాత్తుగా సాధారణ దుస్తుల్లో ఉన్న భద్రతాదళ సిబ్బంది దాడి చేసి వారిని చెల్లాచెదురు చేశారు. ఈ ఘటన ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఆ మర్నాడు నుంచి 50,000 యువాన్లలోపు విత్డ్రాలకు అంగీకరించారు. వచ్చే వారం నుంచి 1,00,000 యువాన్ల వరకు అనుమతి లభించవచ్చని బ్లూమ్బెర్గ్ కథనంలో పేర్కొంది. స్తంభింపజేసిన మొత్తాలను విడతల వారీగా అందజేస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఓ యాప్ ద్వారా చైనా ప్రభుత్వం ప్రజల డేటాను సమీకరించింది. తాజాగా ఆ యాప్ను ఉపయోగించుకొని పోలీసులు ఆందోళనకారుల ఫోన్లను ట్రాక్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more