వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. పర్యావరణ వేత్తలకు, గణేష్ ఉత్సవ కమిటీల నిర్వహకులకు మధ్య అభిప్రాయబేధాలకు కారణం అవుతున్న వినాయక విగ్రహాల తయారీపై ఎట్టకేలకు రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వినాయక విగ్రహాల తయారీపై ఆదారపడిన వారి ఉపాధికి ఎలాంటి నష్టం లేకుండా రాష్ట్రోన్నత న్యాయస్థానం తాజా అదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహాలను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బేబి పాండ్స్లో వాటిని నిమజ్జనం చేయాలని చెప్పింది. గతేడాది దీనికి సంబంధించి హైకోర్టు, దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పలు ఉత్తర్వులు జారీచేశాయి. గతేడాది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పీవోపీ విగ్రహాలను నిషేధించాలని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ వినాయక విగ్రహాల తయారీదారులు హైకోర్టును ఆశ్రయించారు. కరోనాకు ముందు విగ్రహాలను తయారు చేశామని, కనీసం వాటినైనా అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన కోర్టు.. ఇందులో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
పీసీబీ కేవలం మార్గదర్శకాలను మాత్రమే జారీ చేసిందని, ప్రభుత్వం పీవోపీ విగ్రహాలపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేనందున తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. వివాదమంతా విగ్రహాల తయారీపై కాదని, కేవలం నిమజ్జనానికి సంబంధించిన ఈ విషయంలో మాత్రమే వస్తుందని హైకోర్టు పేర్కొంది. హైదరాబాద్లో నదులు, చెరువులు ఎక్కువగా లేనందున సమస్య తలెత్తుతుందని కోర్టు అభిప్రాయపడింది. బెంగాల్ దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంలో అక్కడ కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయని, వాటిని పరిశీలించాలని సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more