కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు వదిలారు. పాలు, పాల ఉత్పత్తులపై దేశచరిత్రలో తొలిసారి జీఎస్టీ విధించిన ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని ఏమనాలని.. అంటూ 24 గంటల క్రితం తనదైన శైలిలో బీజేపిపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టిన టీఆర్ఎస్ వర్కాంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తాజాగా మళ్లీ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. 'దేశంలో డబుల్ ఇంజిన్ అంటే మోడీ, ఈడీ'అని అర్థమైందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈడీ చీఫ్గా బండిని నియమించినందుకు ప్రధాని నరేంద్రమోడీకి ఆయన ధన్యవాదాలు అంటూ సెటైరికల్ ట్వీట్ పోస్టు చేశారు.
రైతుల ఆదాయంపై ప్రధానమంత్రి మోడీ చేసిన ప్రకటనపై కూడా ఎక్కుపెట్టిన ఆయన.. దేశంలోని ఏ రైతు ఆదాయం డబుల్ కాలేదని విమర్శించారు. రైతుల నామజపం చేస్తేన్న బీజేపి.. వారి తెలియకుండానే వారి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులపై జీఎస్టీ విధిస్తోందని మండిపడ్డారు. ఇక తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధినేతగా బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను నియమించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపిపై కేటీఆర్ పలు అంశాలపై ట్విటర్లో తనదైన శైలిలో స్పందించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలో ఉన్న డబుల్ ఇంజిన్ అంటే మోదీ, ఈడీ అని అర్థమైందని వ్యాఖ్యానించారు. అటు ఆదాని అంశంపైనా స్పందించిన కేటీఆర్... ప్రపంచ పేదరిక రాజధానిగా భారతదేశం... నైజీరియాను అధిగమించిందని.. ఇదే సమయంలో ఆదానీ బిల్ గేట్స్ను దాటి మరీ ప్రపంచంలోనే నాలుగో ధనవంతుడయ్యారని పేర్కొన్నారు. ఇవి దేశానికి సంబంధించి రెండు కఠోర వాస్తవాలను అని అన్నారు.
కేంద్రంలోకి బీజేపి ప్రభుత్వం వచ్చిన తరువాత దేశంలో సబ్సీడీలను పూర్తిగా ఎత్తివేస్తూ వస్తోందని కేటీఆర్ దుయ్యబట్టారు. డీజిల్ పై, వంట గ్యాస్ సిలిండర్ పై సబ్సీడీని ఎత్తివేసిన ఘనత కూడా మోడీకే దక్కుతుందని విమర్శించారు. ఇక రైల్వేశాఖ సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను కూడా ఎత్తివేస్తుందన్న వార్తలపైనా స్పందించిన కేటీఆర్... రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత మాత్రమే కాదని, విధి కూడా అన్న ఆయన... కేంద్ర ప్రభుత్వ తమ నిర్ణయాన్ని కరుణా హృదయంతో నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు కేటీఆర్ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more