దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు, అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా కొందరు సముద్రాలు, నదుల వద్ద ఎంజాయ్ చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలాంటి ప్రదేశాల్లో ఉండటం ఎంత ప్రమాదకరమో ఈ వీడియోనే చెబుతోంది. ఐపీఎస్ అధికారిణి షిఖా గోయెల్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. వీడియోలో కొందరు సముద్రం ఒడ్డున అలలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఓ పెద్ద కెరటం వచ్చి అక్కడున్న వారిని సముద్రంలోకి లాకెళ్లింది. అప్పుడు వారిని ఎవరూ కాపాడలేకపోయారు.
కాగా, ఈ వీడియోకు షిఖా గోయెల్.. ‘‘జాగ్రత్తగా ఉండటం కంటే ధైర్యంగా తప్పు చేయడం మంచిది . గొప్ప పశ్చాత్తాపం కంటే కొంచెం జాగ్రత్త మంచిది. ముఖ్యంగా ఇప్పుడు, తీవ్రమైన వర్షపాతం హెచ్చరికల దృష్ట్యా దయచేసి జాగ్రత్తగా ఉండండి’’ అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే, ఈ ఘటన ఒమాన్ దేశంలో చోటుచేసుకుంది. సలాలహ్ హల్ ముగుసెల్ బీచ్లో 8 మంది భారతీయులు.. కెరటాల్లో కొట్టుకుపోగా.. ముగ్గురిని రక్షించారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. అయితే, వారంతా సెఫ్టీ ఫెన్నింగ్ దాటిన కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
Its better to err on the side of daring than the side of caution ......
— Shikha Goel, IPS (@Shikhagoel_IPS) July 12, 2022
A little caution is better than a great regret
Please be cautious especially now, in view of severe rainfall alert pic.twitter.com/Lo6ga6o0t4
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more