తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో తప్పనిసరిగా అమలుకానుంది. మాతృబాష కోసం ఇప్పటికే ఎదిగిన తరాలను ఏమీ చేయలేమని అయితే రానున్న తరాలను మాత్రం మాతృబాషకు దెగ్గరగా ఉంచేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఈ దిశగా చేపట్టిన చర్యల్లో ఈ ఏడాది నుంచి 1 నుంచి పదవ తరగతి వరకు అన్ని తరగతుల్లో తెలుగును తప్పనిసరి చేసింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా ఏ ఇతర బోర్డులకు అనుబంధమైన పాఠశాలలైనా తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
బోర్డులు, బోధనా మాధ్యమంతో సంబంధం లేకుండా తెలుగును బోధించాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2018-19 నుంచి దశలవారీగా తెలంగాణ (పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి బోధన, అభ్యాసం) చట్టం 2018 అమల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. భావి తరాలకు ఉపయోగపడేలా తెలుగు భాష, సాహిత్యాన్ని పరిరక్షించేందుకు అన్ని పాఠశాలల్లో మాతృభాషను తప్పనిసరి చేశారు. గత విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు తెలుగు భాష బోధనను తప్పనిసరి చేశారు.
ఈ విద్యాసంవత్సరం అంటే 2022-23లో అన్ని పాఠశాలల్లో 1-10వ తరగతి వరకు తెలుగును ఒక భాషగా అమలు చేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తెలుగు మాతృభాష కాని పిల్లల కోసం 1-5వ తరగతి వరకు ‘తేనెపలుకులు’, 6 -10వ తరగతి వరకు ‘వెన్నెల’ పేరుతో పాఠ్యపుస్తకాలను రూపొందించారు. తెలుగు మాతృభాషగల విద్యార్థుల కోసం ప్రామాణిక పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచారు. 1-5వ తరగతి వరకు ‘జాబిలి’, 6,7,8 తరగతుల కోసం ‘నవ వసంతం’, 9,10వ తరగతులకు ‘సింగిడి’ పేరుతో పుస్తకాలను రూపొందించారు.
ఈ పుస్తకాలు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి ఎస్సీఈఆర్టీ వెబ్సైట్ http://scert.telangana.gov.in లో అందుబాటులో ఉంచారు. వివిధ బోర్డులకు అనుబంధంగా ఉన్న అన్ని పాఠశాలలు తెలుగు బోధించేందుకు ఉపాధ్యాయులను నియమించడంతోపాటు ఎస్సీఈఆర్టీ రూపొందించిన పాఠ్యపుస్తకాలను అనుసరించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని, తప్పు చేసిన యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీచేస్తామని, జరిమానా విధించడం లేదా గుర్తింపు రద్దుచేయడంలాంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more