నూతన వధువు చేసిన పనికి అమె ప్రియుడి ఇంటిని తగులబెట్టారు కుటుంబసభ్యులు, బంధువులు. నవవరుడు మాత్రం అసలేం జరుగుతుందో కూడా తెలియని అయోమయ స్థితిలోకి జారుకున్నాడు. పెళ్లికి తాలుకు మధురానుభూతులను వరుడు మళ్లీ మననం చేసుకుంటున్న తరుణంలో.. వధువు తరపు బంధువులు, కుటుంబసభ్యులు చేస్తన్న హడావిడి విని ఏం జరిగిందో తెలుసుకున్న ఆయనకు గుండెబద్దలైంది. ఎందుకంటే తెలిసింది అలాంటి వార్తే. తనతో రెండు రోజుల క్రితం తాళి కట్టించుకున్న వధువు మరో వ్యక్తితో పారిపోయింది. వారింట్లోని ఏ ఒక్కరు కూడా గ్రామంలో లేకుండా పారిపోయారు.
పెద్దలను తన ప్రేమ గురించి చెప్పినా వారు అంగీకరించలేదు. దీంతో వారిని ఒప్పించే మరో ప్రయత్నం చేయకుండా.. వారు చూపిన వ్యక్తినే బంధుమిత్రుల సపరివార సమక్షంలో కళ్యాణమాడింది. అయితే ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేని ఆ వధువు.. తీరా మూడవ రోజు మళ్లీ వరుడి ఇంటికి వెళ్లేందుకు అంతా సిద్దమైతున్న సమయానికి ముందే ప్రియుడికి కబురు పంపి.. అందరూ పడుకున్న తరువాత.. సందెట్లో సడేమియాలా జారుకుంది. విషయం తెలిసిన అమె కుటుంబసభ్యులు, బంధువులు ప్రియుడి ఇంటిపైకి వెళ్లారు. అక్కడ చూస్తే ఇంట్లో ఏ ఒక్కరూ లేరు. అంటే అంతా పథకం ప్రకారమే జరిగిందన్న కట్టలు తెంచుకున్న ఆగ్రహంలో వారు వధువు ప్రియుడి ఇంటికి నిప్పుపెట్టారు.
కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం మాధవరంలో పెళ్లి-ప్రేమ వివాదం స్థానికంగా పెనుకలకలం రేపింది. గ్రామానికి చెందిన యువతీ యువకులు ఇద్దరు ప్రేమించుకున్నారు. కాగా, యువతి పెద్దలు అమెకు వేరే పెళ్లి నిశ్చయించారు. యువతి తన ప్రేమ విషయం పెద్దలకు చెప్పింది. అయితే అందుకు అమె కుటుంబ సభ్యులు, పెద్దలు అంగీకరించలేదు. సరిగ్గా పెళ్లి సమయంలో ప్రేమ అంటున్నావేంటి.? ఇలాంటి విషయాలు ముందే చెప్పాల్సింది కదా.? అంటూ శాంతపరుస్తూనే.. అప్పటికే వివాహం కుదిరడంతో అదే యువకుడితో పెళ్లి జరిపించారు. అయితే వధువు కూడా మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకుంది.
దీంతో కుటుంబసభ్యులు, బంధువులు, పెద్దలు అంతా ఊపిరిపీల్చుకున్నారు. అంతా తాము అనుకున్నట్లే జరిగిందని గుండెలపై చేయివేసుకుని రిలాక్స్ అవ్వగా.. వధువు మాత్రం తన ప్లానింగులో అమె ఉంది. తాను ప్రేమించిన యువకుడిని మర్చిపోలేక.. వివాహమైన తరువాత మూడవ రోజే ప్రియుడితో కలసి ఇళ్లు, ఊరు వదిలి పారిపోయింది. ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు ప్రియుడి ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు. దీంతో భయంతో అతడి కుటుంబ సభ్యులు గ్రామం నుంచి పారిపోయారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బందోబస్తును ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడ్డ ప్రియురాలి బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more