Woman elopes with boy friend three days after marriage పెళ్లైన మూడవ రోజు.. ప్రియుడితో పారిపోయిన నవవధువు..

Woman elopes with boyfriend three days after marriage in kurnool relatives set fire to house

birde elopes with boyfriend, birde elopes with boyfriend three days after marriage, Kurnool bride eleopes with boyfriend, Mantralayam bride elopes with lover, madhavaram bride elopes with boyfriend, bride, bride elopes, boyfriend, Shivaji, Madhavaram, Mantralayam mandal, Rachchamarri groom, Kurnool district, Andhar Pradesh, Crime

In a shocking incident, a bride who was just married three days ago had eloped with her boyfriend, which led the relatives set the fire to the boyfriend's house at Madhavaram in Mantralayam mandal in the Kurnool district. Going into the details, the young woman got married on the 9th of this month to a young woman from Rachchamarri.

పెళ్లైన మూడవ రోజు.. పారిపోయిన నవవధువు.. ప్రియుడి ఇంటికి నిప్పు..

Posted: 06/13/2022 04:34 PM IST
Woman elopes with boyfriend three days after marriage in kurnool relatives set fire to house

నూతన వధువు చేసిన పనికి అమె ప్రియుడి ఇంటిని తగులబెట్టారు కుటుంబసభ్యులు, బంధువులు. నవవరుడు మాత్రం అసలేం జరుగుతుందో కూడా తెలియని అయోమయ స్థితిలోకి జారుకున్నాడు. పెళ్లికి తాలుకు మధురానుభూతులను వరుడు మళ్లీ మననం చేసుకుంటున్న తరుణంలో.. వధువు తరపు బంధువులు, కుటుంబసభ్యులు  చేస్తన్న హడావిడి విని ఏం జరిగిందో తెలుసుకున్న ఆయనకు గుండెబద్దలైంది. ఎందుకంటే తెలిసింది అలాంటి వార్తే. తనతో రెండు రోజుల క్రితం తాళి కట్టించుకున్న వధువు మరో వ్యక్తితో పారిపోయింది. వారింట్లోని ఏ ఒక్కరు కూడా గ్రామంలో లేకుండా పారిపోయారు.

పెద్దలను తన ప్రేమ గురించి చెప్పినా వారు అంగీకరించలేదు. దీంతో వారిని ఒప్పించే మరో ప్రయత్నం చేయకుండా.. వారు చూపిన వ్యక్తినే బంధుమిత్రుల సపరివార సమక్షంలో కళ్యాణమాడింది. అయితే ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేని ఆ వధువు.. తీరా మూడవ రోజు మళ్లీ వరుడి ఇంటికి వెళ్లేందుకు అంతా సిద్దమైతున్న సమయానికి ముందే ప్రియుడికి కబురు పంపి.. అందరూ పడుకున్న తరువాత.. సందెట్లో సడేమియాలా జారుకుంది. విషయం తెలిసిన అమె కుటుంబసభ్యులు, బంధువులు ప్రియుడి ఇంటిపైకి వెళ్లారు. అక్కడ చూస్తే ఇంట్లో ఏ ఒక్కరూ లేరు. అంటే అంతా పథకం ప్రకారమే జరిగిందన్న కట్టలు తెంచుకున్న ఆగ్రహంలో వారు వధువు ప్రియుడి ఇంటికి నిప్పుపెట్టారు.

కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం మాధవరంలో పెళ్లి-ప్రేమ వివాదం స్థానికంగా పెనుకలకలం రేపింది. గ్రామానికి చెందిన యువతీ యువకులు ఇద్దరు ప్రేమించుకున్నారు. కాగా, యువతి పెద్దలు అమెకు వేరే పెళ్లి నిశ్చయించారు. యువతి తన ప్రేమ విషయం పెద్దలకు చెప్పింది. అయితే అందుకు అమె కుటుంబ సభ్యులు, పెద్దలు  అంగీకరించలేదు. సరిగ్గా పెళ్లి సమయంలో ప్రేమ అంటున్నావేంటి.? ఇలాంటి విషయాలు ముందే చెప్పాల్సింది కదా.? అంటూ శాంతపరుస్తూనే.. అప్పటికే వివాహం కుదిరడంతో అదే యువకుడితో పెళ్లి జరిపించారు. అయితే వధువు కూడా మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకుంది.

దీంతో కుటుంబసభ్యులు, బంధువులు, పెద్దలు అంతా ఊపిరిపీల్చుకున్నారు. అంతా తాము అనుకున్నట్లే జరిగిందని గుండెలపై చేయివేసుకుని రిలాక్స్ అవ్వగా.. వధువు మాత్రం తన ప్లానింగులో అమె ఉంది. తాను ప్రేమించిన యువకుడిని మర్చిపోలేక.. వివాహమైన తరువాత మూడవ రోజే ప్రియుడితో కలసి ఇళ్లు, ఊరు వదిలి పారిపోయింది. ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు ప్రియుడి ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు. దీంతో భయంతో అతడి కుటుంబ సభ్యులు గ్రామం నుంచి పారిపోయారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బందోబస్తును ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడ్డ ప్రియురాలి బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles