హైదరాబాద్లోని ఆమ్నేషియా పబ్ సమీపంలో బాలికను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మేజర్లు కాగా... ముగ్గురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. బీజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ ఘటనకు సంబంధించి ఇందులో టీఆర్ఎస్, ఎంఐఎంకు సంబంధించిన నేతల పిల్లలు వున్నారనే అరోపించడం. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా లీక్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
ఇప్పటివరకు ఈకేసులో తగు ఆధారాలే లభించలేదని పోలీసులు పేర్కోన్న తరుణంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పలు ఆధారాలను విడుదల చేయడం.. పోలీసుల్లోనూ కలవరం రేపింది. బెంజ్ కారులో ఉన్న ఎమ్మెల్యే కొడుకు, కారులో సదరు అమ్మాయితో అసభ్యంగా వ్యవహరిస్తున్న ఫొటోలను ఆయన విడుదల చేశారు. పోలీసులు తమను భయపెట్టడం మానేసి, తప్పులు చేసిన వారిని భయపెట్టండని వ్యాఖ్యానించారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే కేసులు పెడతామని పోలీసులు అన్నారని... అందుకు ఈ ఆధారాలన్నీ చూపిస్తున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులకు పలు ప్రశ్నలను కూడా సంధించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అత్యాచారం కేసులో ఇప్పటివరకు కనిపించకుండా పోయిన ఇన్నోవా వాహననా్ని గుర్తించారు. అయితే అత్యాచారం బెంజ్ కారులో జరిగిందా.? లేక ఇన్నోవా వాహనంలో జరిగిందా.? అన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఘటన తర్వాత వేర్వేరు దారుల మీదుగా కర్ణాటక పారిపోయిన నిందితులు ఇన్నోవాను మాత్రం పోలీసులకు చిక్కకుండా దాచేశారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీల సాయంతో ఇన్నోవా ఆచూకీని కనుగొన్నారు. కారులో క్లూస్ టీంతో ఆధారాలు సేకరించే పనిని పోలీసులు చేపట్టారు. అయితే ఈ కేసులో కీలక నిందితుడ్ని ఇప్పటికే దేశం దాటించేశారన్న అరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more