కరోనా మహమ్మారి ముగిసిందని భావించినా ఇప్పటికీ పలు దేశాల్లో ఇంకా తన ప్రభావం చాటుతూనే వుంది. ఈ క్రమంలో ఊపిరి పీల్చకుంటున్న ప్రజలపై జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు సోకుతున్నాయి. దీంతో యావత్ ప్రపంచం మరోమారు కలవరపాటుకు గురవుతోంది. ఓ వైపు మంకీ పాక్స్ ప్రపంచదేశాలకు విజృంభిస్తుండగా, అదే సమయంలో ఇటు కాంగో ఫీవర్ కూడా ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంది. ప్రాణాంతక కాంగో ఫీవర్తో ఇరాక్ ను వణుకిస్తోంది. దేశంలో ఇటీవల ఈ కేసులు భారీగా వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ప్రాణాంతక జ్వరం బారిన పడి ఈ ఏడాది ఇప్పటి వరకు 19 మంది మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) తెలిపింది. జంతువుల నుంచి మానవులకు వ్యాపించిన ఈ కాంగో ఫీవర్ సోకితే జ్వరం, ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలతో మరణిస్తారు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, మరీ ముఖ్యంగా ఆవులు, గోదలపై క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. తల నుంచి పాదాల వరకు పీపీఈ కిట్లు ధరించడంతోనే దాని నుంచి తప్పించుకోవచ్చునన్న వార్తలు రావడంతో.. ఇరాక్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినీ పిపిఈ కిట్లు ధరించే ప్రజలు తిరుగుతున్నారు.
నైరో వైరస్ అని పిలిచే క్రిమియన్-కాంగో హోమోరేజిక్ ఫీవర్ అనే రక్తం పీల్చే పేలు ద్వారా కాంగో ఫీవర్ జంతువుల నుంచి మానవులకు సోకుతోంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల మలం, రక్తం, చెమట కణాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇరాక్లో 1979లో తొలిసారి ఈ వైరస్ వెలుగు చూసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కరోనా కారణంగా పశువుల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయకపోవడం, గ్లోబల్ వార్మింగ్ వంటివి ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది.
ఇక మరోవైపు యావత్ ప్రపంచాన్ని మంకీపాక్స్ వణికిస్తోంది. పశువుల నుంచి మనుషులకు సంక్రమించే ఈ వ్యాది కారణంగా ప్రజారోగ్యానికి ముప్పుపొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ఇదే కలవరపాటుకు గురిచేస్తోందని డబ్యూహెచ్ఓ పేర్కోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 23 దేశాల్లో 257 కేసులు నమోదయ్యాయని తెలిపింది. మరో 120 మందిలో లక్షణాలను గుర్తించామని వెల్లడించింది. కొన్ని దేశాల్లో బయటపడిన మంకీపాక్స్ వేగంగా వ్యాప్తిచెందుతున్నదని ఆందోళన వ్యక్తంచేసింది.
వైరస్ సమూహ వ్యాప్తి ప్రారంభమైతే.. చిన్నారులు, రోగ నిరోధక శక్తి లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ముప్పు పొంచిఉన్నదని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. త్వరలోనే భారీసంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని, వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని సూచించింది. మంకీపాక్స్పై అందరికి అవగాహన కల్పించాలని, వ్యాధి లక్షణాలను తెలియజేయాలని పేర్కొన్నది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more