అన్ని రాష్ట్రాల మాదిరిగా కర్ణాటక అప్పుడప్పుడు కాకుండా నిత్యం వార్తల్లో ఉంటోంది. ఆ మధ్య ఆంజనేయుడు పుట్టిన పుణ్యభూమి విషయమై వివాదం రేగగా, ఉత్తర భారతానికి చెందిన కోందరు నేతలు ఆయన దళితుడని చౌకబారు వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పటి నుంచి ఏదో ఒక అంశంలో కర్ణాటక వార్తల్లో నిలుస్తోంది. ఆ తరువాద ముఖ్యమంత్రి మార్పు, ఆ వెంటనే ఆయన వైరాగ్య వ్యాఖ్యలు, హిజబ్ వివాదం, మసీదులపై మైకులు తీసివేయాలని, ఆ తరువాత ముఖ్యమంత్రి పదవికి కోసం రూ.2500 కోట్లు అడుగుతున్న బీజేపి అంటూ.. ఇలా అనేక వివాదాస్పద అంశాలతో ఆ రాష్ట్రం వార్తల్లో నిలుస్తోంది.
ఇక తాజాగా విద్యార్థులు నడిరోడ్డుపై కోట్టుకోవడం వైరల్ గా మారింది. అయితే విద్యార్థులు అంటే మగపిల్లలు కాదు.. ఏకంగా ఆడపిల్లలు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. అలా ఇలా కాదు.. భిగ్గరగా అరుస్తూ.. జుట్టుపట్టుకుని లాగి పడేస్తూ.. కిందకు నెట్టేస్తూ.. రక్కేస్తూ.. చివరకు కర్రలను చేతబట్టి కూడా కొట్టేసుకున్నారు. ఓ పాఠశాలకు చెందిన విధ్యార్థినులు ఇలా కోట్టుకోవడం చూసిన స్థానికులు వెంటనే తమ సెల్ ఫోన్లకు పనిచెప్పారు. అవికాస్తా నెట్టింట్లో పోస్టు చేయడంతో వైరల్ గా మారాయి. అయితే విద్యార్థినిలు కొట్టుకోవడానికి గల అసలు కారణం మాత్రం తెలియరాలేదు. కాగా, ఓ విషయంపై రెండు వర్గాల విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. కొద్ది సేపటికే ఈ చర్చ గొడవకు దారి తీసిందని సమాచారం.
దీంతో ఓ వర్గానికి చెందిన బాలికల గుంపు మరొక వర్గంవారిపై దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాల అమ్మాయిలు ఒకరినొకరు జుట్టు పట్టుకొని లాక్కున్నారు. గట్టిగా కేకలు వేస్తూ, కర్రలతో దాడిచేస్తూ, తన్నుకున్నారు. ఈ ఘర్షణను చూసిన ఇతర పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థులు కల్పించుకుని వారిని అడ్డుకుని శాంతింపజేశారు. గొడవ పడుతున్న బాలికలందరూ స్కూల్ యూనిఫాం ధరించి ఉన్నారు. వీరంతా బెంగుళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా తేలిసింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో కూడా తెలియరాలేదు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది తన ఫోన్లలో రికార్డ్ చేశారు. దీంతో నెట్టింట్లో ఈ వీడియో మాత్రం తెగ హల్చల్ చేస్తోంది.
Y'all need to even if y'all haven't already pic.twitter.com/fBbJv9CXoc
— T.sh (@Taha_shah0) May 17, 2022
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్పూర్లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more