షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియాకు దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఎట్టకేలకు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. తన కూతురు షీనా బోరా హత్యకేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న ఇంద్రాణి.. అరెస్టైన 2015 నుంచి దాదాపుగా ఆరున్నరేళ్లుగా జ్యుడిషియల్ రిమాండ్ లోనే ఉంది. ఇదే పాయింట్ ను ఆధారంగా చేసుకుని అమె తరపు న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానంలో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. ఇది చాలా ఎక్కువ సమయం అని వ్యాఖ్యానించింది.
ఈ మేరకు అమెకు ఇవాళ బెయిల్ మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం షరతులను కూడా విధించింది. అయితే ఈ కేసులో మరో నిందితుడిగా అభియోగాలు ఎదర్కెన్న అమె భర్త పీటర్ ముఖర్జీకు రెండేళ్ల క్రితమే బెయిల్ మంజూరు చేసింది. కాగా ఆయన బెయిలుపై విధించిన షరతులే ఇంద్రాణికి కూడా వర్తిస్తాయని జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు, జస్టిస్ బిఆర్ గవల్ లతో కూడిన సర్వోన్నత న్యాయస్థాన ద్విసభ్య ధర్మసనం తెలిపింది .కాగా 2012లో సంచలనం సృష్టించిన షీనా బొరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సహకారంతో షీనాను ఇంద్రాణీ ముఖర్జీ హత్య చేసింది. ఈ కేసులో హత్య జరిగిన మూడు సంవత్సరాలకు 2015 ఆగస్టు 25న ఇంద్రాణి అరెస్ట్ అయ్యారు. అనంతరం మూడో భర్త పీటర్ ముఖర్జియాను సైతం అదుపులోకి తీసుకోగా.. 2020లో పీటర్కు బెయిల్ వచ్చింది. ఇంద్రాణీ జైలుశిక్ష అనుభవిస్తున్న సమయంలో తన కుమార్తె ప్రాణాలతోనే ఉందని సీబీఐకి లేఖ రాసింది. షీనా బోరాను జైలు అధికారి ఒకరు కశ్మీర్లో చూశానని చెప్పిందని ఆ లేఖలో పేర్కొంది. ఈ విషయమై దర్యాప్తు కూడా చేయాలని సీబీఐని కోరింది. 2015 నుంచి ముంబై జైల్లో అండర్ ట్రయల్గా ఉన్నా.. బెయిల్ లభించకపోవడంతో సుప్రీం తలుపు తట్టింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం తాజాగా బెయిల్ మంజూరుచేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more