కరోనావైరస్ మహమ్మారి దేశంలోకి ఏ గడియన అడుగుపెట్టిందో తెలియదు కానీ.. 2021లో విధించిన తొలి లాక్ డౌన్ ఎత్తివేసి అన్ లాక్ ప్రవేశపెట్టిన వెంటనే దేశంలో ధరాఘాత సమస్య ఉత్పన్నమయ్యింది. సామాన్య మధ్యతరగలి ప్రజలు అర్థాకలితో జీవితాలను ఈడుస్తూ పేదల జాబితాలోకి కలసిపోయారు. ఇక పేదలు కనీసం రోజుకో పూట అన్నం కోసం అర్థిస్తున్నారు. అంతలా పరిస్థితులు మారిపోతున్న క్రమంలో ప్రజలపై పడుతున్న విపరీత భారాన్ని తగ్గించాల్సిన ప్రభుత్వాలు.. దేశ, రాష్ట్రాల అర్థిక పరిస్థితులను పటిష్టపర్చుకునే నేపథ్యంలో వేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నులు సామాన్యులకు శరాఘతంలా పరిణమిస్తున్నాయి,
అందుకు పెరుగుతున్న ఇంధన దరలు, మరీ ముఖ్యంగా డీజిల్ ధరల అన్ని నిత్యావసర సరుకుల రవాణాపై ప్రభావం చూపుతోంది. ఇక తాజాగా సామాన్యుడి నెత్తిపై వంట గ్యాస్ సిలిండర్ ‘బాదుడు’ బరువు మరింత పెరిగింది. ఇప్పటికే పలుమార్లు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలతో అగ్గిమీద గుగ్గిలంగా తయారైన మహిళలు.. వంటింట్లోకి వెళ్లగానే మరోమారు కేంద్రప్రభుత్వంపై మండిపడతున్నారు. అందుకు కారణం సబ్సీడి గ్యాస్ సిలిండర్ ధర పెరగడమే. అందునా ఒక్కసారిగా రూ. 50 పెంచేసింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్పై రూ. 50 పెంచినట్లు, పెంచిన ధరలు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చినట్లు ప్రకటించాయి.
దీంతో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1052కి చేరింది. గ్యాస్ సిలిండర్ పై ఇప్పటివరకు లభిస్తున్న రూ.40 సబ్సీడీని కలుకున్నా.. ఏకంగా ఎల్సీజీ సబ్సీడీ సిలిండర్ ధర ఏకంగా రూ. వెయ్య మార్కును దాటింది. గత వారం వ్యవధిలో సిలిండర్ బుక్ చేసుకున్న కొందరికి సైతం ఈ పెంపు వర్తించడం గమనార్హం. ఇక నెల గ్యాప్ తర్వాత ఇప్పుడు యాభై రూపాయలు పెంచాయి కంపెనీలు. డొమెస్టిక్ సిలిండర్లపై మార్చి 22న పెంపు ఇచ్చిన కంపెనీలు.. ఆ టైంలోనూ 50 రూ. పెంచాయి. ఏప్రిల్లో పెంపు ప్రకటించలేదు. అటు కమర్షియల్ సిలిండర్ ధర రూ.2, 563గా ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more