రంజాన్ పండుగ సందర్భంగా మిత్రులను పార్టీకి ఆహ్వానించి విందు ఇవ్వగా ఓ మిత్రురాలి బాయ్ ఫ్రెండ్ చేసిన నిర్వాకం ఆయనను ఆసుపత్రిపాలు చేసింది. అదెలా అంటే.. ర్ల్ఫ్రెండ్ స్నేహితురాలు ఇచ్చిన పార్టీకి వెళ్లిన ఓ వ్యక్తి.. అక్కడ ఉన్న రూ. 1.45లక్షల విలువ చేసే నగలను మింగేశాడు. పార్టీకి వెళ్లి ఫుల్ తాగి, బిర్యానితో పాటు రూ. 1.45లక్షల విలువ చేసే నగలను కూడా పొట్టలోకి తోసేశాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ నెల 3న రంజాన్ పండగ నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. నగల దుకాణాన్ని నడుపుతున్న ఓ మహిళ.. ఈద్ సందర్భంగా ఘనంగా పార్టీని నిర్వహించింది. పార్టీకి తన స్నేహితురాలిని పిలిచింది. ఆమె.. తన బాయ్ఫ్రెండ్తో పార్టీకి వెళ్లింది.
పార్టీలో ఫుల్గా తాగేసిన ఆ బాయ్ఫ్రెండ్.. ఏం చేస్తున్నాడో అర్థం కాని స్థితికి చేరాడు. ఈ క్రమంలోనే బిర్యానితో పాటు తెలియకుండానే రూ. లక్షల విలువైన నగలను కూడా బిర్యాని అనుకుని మింగేశాడు. తిథులందరు వెళ్లిపోయిన తర్వాత, పార్టీ ఇచ్చిన మహిళ.. ఇల్లు సద్దడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే కాప్బోర్డులో ఉండాల్సిన గోల్డ్ చెయిన్, డైమండ్ పెండెంట్, డైమెంట్ నెక్లెస్లు అదృశ్యమైనట్టు గ్రహించింది. అతిథులను సంప్రదించిన తర్వాత.. తన స్నేహితురాలి బాయ్ఫ్రెండ్ మీద ఆమెకు అనుమానం పెరిగింది. తన నగలను అతడు దొంగలించి ఉంటాడని భావించి, విరుగంబక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ నెల 4న ఆ వ్యక్తిని పిలిపించి విచారణ జరిపారు. అయితే అప్పటికే కడుపులో నొప్పితో సదరు వ్యక్తి బాధపడుతున్నాడు. పోలీసులు అడిగేసరికి విషయం అతనికి అర్థమైంది. దీంతో చేసిన నేరాన్ని అతను ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే అతడి కడుపును స్కాన్ చేసిన పోలీసులకు.. లోపల నగలు కనిపించాయి. వెంటనే అతడిని వైద్యుల వద్దకు తీసుకెళ్లారు పోలీసులు. రూ. 95వేలు విలువచేసే నెక్లెస్, రూ. 25వేల గోల్డ్ను పొట్టలో నుంచి బయటకు తీశారు. కానీ పెండెంట్ మాత్రం కడుపులోనే ఉండిపోయింది. మరో ఆపరేషన్ చేసిన దానిని కూడా బయటకు తీశారు వైద్యులు. తాగిన మైకంలోనే అతను నగలను మింగేసినట్టు పోలీసులు నిర్ధరణకు వచ్చారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more