కాబోయే భర్త.. త్వరలో వివాహం కూడా జరగబోతోంది. అంతేకాదు ఎంగేజ్మెంట్ కూడా పూర్తైంది. అతను అమెతో తరచూ మాట్లాడటంతో ఇద్దరి మధ్య చనువు పెరిగింది. అయితే ఇదే సమయంలో అమెకు తనకు కాబోయే భర్త గురించి ముగ్గురు యువకులు చెడుగా చెప్పారు. తనకు కాబోయే భర్తపై ఇంత చెడుగా చెప్పడం వల్ల వారికేం లాభం.. వారి మాటలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదన్న అన్న కోణంలో అమె అలోచన చేసింది. అంతే అమెకు తన కాబోయే భర్తపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ అతడికి వ్వతిరేకంగానే ఉన్నాయి. దీంతో కాబోయే భర్త అని కూడా ఉపేక్షించకుండా అమె అతడ్ని కటకటాల వెనక్కి నెట్టింది.
మాయమాటలతో అనేకమందిని బురిడీ కోట్టించి విలాసంగా తిరుగుతూ.. మహిళా ఎస్ఐని కూడా మోసం చేయబోయిన వంచకుడిని శ్రీకృష్ణజన్మస్థానికి పంపింది. ఈ ఘటన అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ జున్మోని రాభాకు, రానా పోగాగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా పరిచయం చేసుకున్న అతడితో గత ఏడాది అక్టోబర్లో ఎంగేజ్మెంట్ జరిగింది. నవంబర్లో వారిద్దరికి పెళ్లి నిశ్చయమైంది. అయితే కాబోయే భర్త మోసగాడన్న సంగతి ఎస్ఐ జున్మోనికి ఆ తర్వాత తెలిసింది. ఓఎన్జీసీలో పని చేస్తున్నానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన రానా, పలువురిని మోసగించి కోట్లలో డబ్బులు వసూలు చేశాడు.
ఈ విషయం ఆ పోలీస్ అధికారిణి దృష్టికి వచ్చింది. దీంతో ఆమె ఆలస్యం చేయకుండా కాబోయే భర్తపై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అస్సాం పోలీసులు రానా పోగాగ్ను గురువారం అరెస్ట్ చేశారు. మరోవైపు తన కళ్లు తెరిపించిన ముగ్గురు వ్యక్తులకు ఎస్ఐ జున్మోని రాభా ధన్యవాదాలు తెలిపారు. తనకు కాబోయే భర్త రానా పోగాగ్ పెద్ద మెసగాడన్న సంగతిని వారు చెప్పారని మీడియాతో ఆమె అన్నారు. కాగా, ఈ పోలీస్ అధికారిణి ఈ ఏడాది జనవరిలో వార్తల్లో నిలిచారు. బిహ్పురియా ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్ పిలుపు మేరకు చట్ట ఉల్లంఘనకు పాల్పడిన బీజేపీ నేతలకు మద్దతు ఇచ్చేందుకు ఆమె నిరాకరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more