హిందూ దేశంగా భారత్ నిలవాలన్నా.. ప్రపంచ దేశాల గమనాన్ని సక్రమైన మార్గంలో పయనింపజేయాలన్నా.. అది హిందువులతోనే సాధ్యమని, ఈ క్రమంలో హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ హిందువులకు మార్గనిర్ధేశనం చేయడంతో పాటు పలువురు హిందూవాద నేతలు పిలుపునిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి పిలుపులు ఇస్తున్న నేతల సంఖ్య పెరిగింది. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం తరువాత మరో వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలన్న పిలుపులు మరింత పెరుగుతున్నాయి.
భారతావని ఇస్లామిక్ దేశంగా మారకూడదంటే హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలని వివాదాస్పద స్వామీజీ యతి నర్సింగానంద్ గతంలో ఒకసారి పిలుపునివ్వగా, ఆయన ఆధ్వర్యంలోని సంస్థలోని మరో నేత కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి చర్చనీయాంశంగా మారారు. అమె మరెవరో కాదు.. హిందుత్వ నేత, దుర్గా వాహిని వ్యవస్థాపకురాలు సాధ్వి రితంబర కూడా ఇలాంటి పిలుపే ఇచ్చారు. హిందూ దంపతులు నలుగురు పిల్లల్ని కనాలని, వారిలో ఇద్దరిని దేశానికి అంకితమివ్వాలని కోరారు. అలా చేస్తేనే దేశం హిందుత్వ రాజ్యమవుతుందన్నారు.
లక్నోలోని నీరాల నగర్లో నిర్వహించిన రామ మహోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వీహెచ్పీ, భజరంగ్దళ్, ఆరెస్సెస్ నేతలతోపాటు పలువురు సాధువులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితంబర మాట్లాడుతూ.. రాజకీయ ఉగ్రవాదం ద్వారా హిందూ సమాజాన్ని విభజించాలని చూస్తున్న వారి అంతుచూస్తానని హెచ్చరించారు. మనం ఇద్దరం, మనకు ఇద్దరు విధానాన్ని అనుసరించకూడదని అన్నారు. హిందూ సమాజంలోని సోదరులు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలని కోరారు.
ఇక ఆ నలుగురిలో ఇద్దరిని ఆరెస్సెస్కు అప్పగిస్తే ఆరెస్సెస్ వలంటీర్ అవుతారు, భజరంగ్దళ్ బజరంగ్ దేవ్ అవుతాడు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్త అవుతాడు అన్నారు. మీ నుదిటిపై భరత ధూళిని పూయడం ద్వారా మీ జన్మ ధన్యమవుతుంది అని ఆమె అన్నారు. నా దేశం ప్రధానమని, నా జాతి ప్రయోజనాలే ముఖ్యమనేది హిందూ జాతి మంత్రం కావాలని అన్నారు. దేశంలో ధరాఘతం, ఇంధన పెరుగుదల, గ్యాస్ సిలిండర్ ధర, నిత్యావసర సరుకుల ధరలతో పాటు సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా పేదరికంలోకి కూరుకుపోతున్న వేళ.. వీహెచ్ పీ నేతలు మాత్రం ఆ అంశల పై నుంచి ప్రజల దృష్టిని ఏమార్చడానికి.. ఈ తరహా పిలుపులకు ఆస్కారమిస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more