కంచే చేసు మేసిందన్న చందంగా రైల్వే స్టేషన్ లో పార్క్ చేసిన వాహనాల తిరిగి వాహన యజమానులు తీసుకెళ్లే వరకు భద్రంగా చూసుకోవాల్సిన వ్యక్తే పార్కింగ్ చేసిన వాహనాల నుంచి పెట్రోల్ దొంగలించి అడ్డంగా బుక్కయ్యారు. అంతేకాదు తన నోటి దురుసుతో పెట్రోల్ ఎందుకు తీస్తున్నావ్ అన్న కానిస్టేబుల్ కు ఎదరుతిరగి.. తనకు పెట్రోల్ తీసే హక్కు వుందని వాదించాడు. అంతటితో ఆగని సదరు వ్యక్తి.. రూ.12 లక్షలు ఇచ్చి కాంట్రాక్టు మీరే తీసుకోండి.. మేం వెళ్లిపోతం అని చెప్పడం గమనార్హం. ఇందుక సంబంధించిన వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
భువనగిరి రైల్వేస్టేషన్ అధికారులు, వాహనదారుల పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాల నుంచి పెట్రోల్ దొంగలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తి భువనగిరి రైల్వే స్టేషన్ వద్ద వాహనాల పార్కింగ్ కాంట్రాక్టు పోందిన హేమంత్ రెడ్డి తమ్ముడు శ్రావణ్ రెడ్డిగా గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి రైల్వే స్టేషన్ వద్ద వాహనాల పార్కింగ్ కాంట్రాక్టును హేమంత్ రెడ్డి అనే వ్యక్తి పోందారు. అయితే అతని సోదరుడు శ్రావణ్ రెడ్డికి దాని నిర్వహణా బాధ్యతలను అప్పజెప్పారు.
కాగా శ్రావణ్ రెడ్డి ఎన్నాళ్లుగానే అక్కడ పార్క్ చేసిన వాహనాల నుంచి పెట్రోల్ తీస్తున్నాడు. యధావిధంగా శనివారం రాత్రి కూడా అక్కడ పార్క్ చేసిన వాహనాల నుంచ పెట్రోల్ తీస్తుండగా చూసిన కొందరు స్థానికి కానిస్టేబుల్ కు పిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్ తన సెల్ పోన్ లో రికార్డింగ్ అప్షన్ అన్ చేసి.. శ్రావణ్ రెడ్డి వద్దకు వెళ్లి ఎందుకు పెట్రోల్ తీస్తున్నావ్ అని విచారించాడు. దీంతో ఎస్ఐ మేడమే తనను పెట్రోల్ తీయమనిందని.. మొదట బుకాయించిన అతను.. ఆ తరువాత కానిస్టేబుల్ పదే పదే ఎవరు అని ప్రశ్నించగా.. మాటమార్చిన శ్రావణ్ రెడ్డి తనకు పెట్రోల్ తీసే రైట్స్ ఉన్నాయని చెప్పాడు.
తాను రైల్వే పార్కింగ్ కాంట్రాక్టును రూ.12 లక్షలకు తీసుకున్నానని, డబ్బులు రావడం లేదని.. దాంతోనే ఈ పనిచేస్తున్నానని చెప్పకనే చెప్పాడు. అంతేకాదు కానిస్టేబుల్ ను రూ.12 లక్షలు ఇచ్చి ఈ కాంట్రాక్టు తీసుకుని నడిపించుకోవాలని కూడా సూచనలు కూడా చేశాడు. అయితే ఇదంతా సౌమ్యంగా కాకుండా ఇద్దరి మధ్య సంబాషణ దురుసుగా సాగింది. కాంట్రాక్ట్ తీసుకున్నామని... పెట్రోల్ తీయడం తమ హక్కని... ఏం చేసుకుంటావో చేస్కో అంటూ వాగ్వాదానికి దిగాడు. ఇదిగో ఇక్కడ ఈ బండిలో తీశా.. అక్కడ ఆ బండిలో తీశా.. తీసుకో ఫోటోలు, వీడియోలు తీసుకో.. అంటూ బదులిచ్చాడు. అంతేకాదు.. సర్ మీరిక్కడ కొత్తగా జాబ్ చేస్తున్నారు. నాకు ఎట్ల పైసల్ వస్తాయి.' అంటూ ఎదురు ప్రశ్నించాడు.
తానే పెట్రోల్ తీస్తున్నానంటూ.. తాను చేస్తున్న పనితో అడ్డంగా దోరికిన తరువాత కూడా దానిని సమర్థించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పార్కింగ్ చేసిన వాహనాల నుంచి పెట్రోల్ తీసుకొమ్మని మీకు బాండ్ రాసిచ్చారా అని కానిస్టేబుల్ ప్రశ్నిస్తే... కాంట్రాక్ట్కు 12 లక్షలు కట్టు అంటూ దురుసుగా ప్రవర్తించాడు. తాము కాంట్రాక్ట్ వదిలేస్తామని మీరు చూసుకోండి అని అన్నాడు. 'బ్రదర్ మీరు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. కొత్తగా జాబ్లో ఎక్కినట్లు ఉన్నారు. నువ్వు ఏం చేసుకుంటావో చేస్కో. మీలాంటోళ్లను మస్త్ మందిని చూశా.' అంటూ కానిస్టేబుల్తో శ్రవణ్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైల్వే పోలీసులు, స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారం మేరకు... స్థానిక పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. వాహనాల నుంచి పెట్రోల్ కానీ.. లేక ఎలాంటి దొంగతనాలు జరగకుండా భద్రంగా కాపాడేందుకు వాహనాల పార్కింగ్ తీసుకుని.. వారే స్వయంగా దొంగతనానికి పాల్పడితే ఎలా అంటూ వాహనాదారులు వాపోతున్నారు. వాహన పార్కింగ్ కాంట్రాక్టర్ హేమంత్ రెడ్డి, అతని సోదరుడు శ్రవణ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. హేమంత్ర రెడ్డి నుంచి భువనగిరి వాహన కాంట్రాక్టును తక్షణం రైల్వే అధికారులు రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more