చైనాలో ప్రాణాంతక కోవిడ్ ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్లు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. కరోనా పురుడుపోసుకున్న దేశం నుంచే గత రెండున్నరేళ్లుగా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టి అధికారికంగా ఏకంగా 61 లక్షల మందిని బలి తీసుకుంది. ఇవాళ్టికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రోజు సగటున 3,500 మందిని మట్టుబెడుతున్న మహమ్మారి మళ్లీ చైనాలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ కొవిడ్ టీకా బూస్టర్ అందించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 10 నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వయోజనులు అందరికీ కరోనా టీకా ప్రికాషన్ డోసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.
కరోనా టీకా రెండో డోసు తర్వాత తొమ్మిది నెలల పూరైనవారు బూస్టర్ డోసు తీసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా అర్హులైన వారందరికీ కరోనా మొదటి, రెండో డోసు టీకాతో పాటు ఆరోగ్య కార్యకర్తలందరికీ, 60 ఏళ్లు పైనున్నవారికి ఇస్తున్న బూస్టర్ డోసును యథావిధిగా కొనసాగిస్తారు. ఇప్పటివరకు దేశంలో 15 ఏళ్లు పైనున్న 96 శాతం జనాభాకు కనీసం ఒక డోసు పూరైంది. 83 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. 2.4కోట్ల ప్రికాషన్ డోసులను ఆరోగ్య కార్యకర్తలకు, 60 ఏళ్లు పైనున్నవారికి పంపిణీ చేశారు. 12-14 ఏళ్ల పిల్లల్లో 45 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు.
చైనాలో కరోనా వైరస్ విజృంభనతో అక్కడి ప్రజలు తీవ్రంగా అల్లాడిపోతోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ కట్టడిలో భాగంగా ఇప్పటికే కోట్ల మందిపై లాక్డౌన్ ఆంక్షలు విధిస్తోంది. ముఖ్యమైన నగరాలతో పాటు వాణిజ్యనగరాలు, పారిశ్రామిక నగరాలు ఇలా పలు నగరాల్లో లాక్ డౌన్ అమలులో ఉన్నా వేల సంఖ్యలో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతూనే వున్నాయి. ఈ పరిణామం చైనా అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే సమయంలో కొత్తగా కరోనా ఉపరకం వెలుగు చూడడం చైనా అధికారులను కలవరపెడుతోంది. భారత్కు కూడా ఈ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం ప్రికాషన్ డోసులపై దృష్టి పెట్టింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more