తమ తండ్రి మరణించాడన్న వార్త తెలియగానే అదే రోజున ఆయన మృతదేహాన్ని తీసుకుని వచ్చి అంత్యక్రియలు నిర్వహించాడు ఆయన కుమారుడు. ఆ మరుసటి రోజు తన తండ్రి మరణాన్ని తలుచుకుని విషాదంలో మునిగిపోయిన కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది. అంత్యక్రియలు పూర్తి చేసిన 24 గంటల తర్వాత చనిపోయిన వ్యక్తి సజీవంగా ఇంటికొచ్చి కుటుంబసభ్యులకు తేరుకోలేని షాక్ ఇచ్చాడు. తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని బనగలద్పూర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. ఈ విషయం తెలిసిన పోలీసులు మరణించిన వ్యక్తి అసలు వివరాలు ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 55 ఏళ్ల మూర్తి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. కాగా తిరుపూర్ లో పోలాల్లో చెరుకు పంట కోసేందుకు కొందరు దినసరి కూలీలతో కలసి కొన్ని రోజుల క్రితం వెళ్లాడు. కాగా, గత ఆదివారం సాయంత్రం మూర్తి కుమారుడు కార్తికి బంధువుల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ వినగానే కుమారుడు కార్తి దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. ఫోన్ లో బంధువు మాట్లాడుతూ.. ‘‘ మీ నాన్న మూర్తి లాగానే ఉన్న ఓ వ్యక్తి ఇక్కడి సమీపంలోని బస్టాపులో శవమై కనిపించాడని చెప్పారు. దీంతో తల్లికి సమాచారం అందించిన కార్తికి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు. మృతదేహాన్ని చూసి అది తన తండ్రిదేనని నిర్ధారించాడు.
సత్యమంగళం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అయితే మూర్తి మరణానికి గల కారణాలు ఏమీటన్నది దర్యాప్తు తరువాత చెబుతామని అన్నారు. ఇక మూర్తి కుటుంబసభ్యులు కోరడంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూడా తరలించకుండా కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు అదే రోజున (ఆదివారం రాత్రి) అంత్యక్రియలు నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేశారు. విషాదంలో మునిగిన మూర్తి భార్యను అమె బంధువులు ఓదార్చుతుండగా, అమె కుమారుడు కార్తి ఇంట్లో కూర్చోని బాధపడుతున్నారు.
కుటుంబ పెద్ద చనిపోయిన విషాదంలో మునిగిన కుటుంబ సభ్యులు.. సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చిన మూర్తిని చూసి నిర్ఘాంతపోయారు. తమ కళ్లను నమ్మలేకపోయారు. అతడి కుమారుడు కార్తి అయితే షాక్ నుంచి చాలా సేపటి వరకు తేరుకోలేకపోయాడు. తన తండ్రి మరణవార్త విని ఎంత షాక్ అయ్యానో, ఆయన ఇంటికి వచ్చినప్పుడు కూడా అంతే షాక్కు గురయ్యానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి తన తండ్రి బతికే ఉన్నారన్న సంతోషాన్ని పట్టలేకపోయిన కార్తి.. ఈ విషయాన్ని బందువులందరికీ చెప్పాడు. పనిలో పనిగా పోలీసులకు కూడా ఈ సమాచారాన్ని చేరవేశాడు.
కార్తి చేరవేసిన సమాచారంతో పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. కార్తీ ఇది తన తండ్రి మృతదేహమేనని గుర్తిపట్టిన నేపథ్యంలో ఎలాంటి పోస్టుమార్టం చేయకుండానే మృతదేహాన్ని అప్పగించారు. తీరా తన తండ్రి బతికి ఉన్నాడని చెప్పడంతో పోలీసులకు పని మరింత పెరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పరుగుపరుగు మృతదేహాన్ని ఖననం చేసిన స్థలానికి పరుగులు పెట్టారు. ఇద్దరు ప్రభుత్వ వైద్యులను పిలిపించి.. స్థానిక తహసీల్దార్ సహా రెవెన్యూ అధికారి సమక్షంలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. ఫోటోలు తీయించారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీయించిన తరువాత చనిపోయింది ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more