Man robs petrol from bunk in Guntur, CCTV footage బంకు నుంచి పెట్రోల్ దొంగతనం.. పట్టించిన సీసీటీవీ

Man robs petrol from petrol bunk in andhra pradesh cctv footage

Man robs petrol from bunk in Prathipadu, Man robs petrol from bunk in Guntur, Man robs petrol from bunk in Andhra Pradesh, Petrol, 20 litres water cans, Petrol bunk, cctv cameras, Prathipadu, Guntur, Andhra Pradesh, Crime

Amid skyrocketing fuel prices, a man theft two cans of petrol from a bunk and shocked everyone. The incident took place in Prathipadu in the Guntur district. A person entered a petrol bunk in Prathipadu with two empty water cans and filled them with petrol, escaped from the spot. The video of stealing petrol from the bunk was captured on the CCTV cameras installed on the premises of the bunk.

బంకు నుంచి పెట్రోల్ చోరీ.. ఒక్కరు కాదు ముగ్గురు దొంగలను పట్టించిన సీసీటీవీ

Posted: 04/06/2022 07:20 PM IST
Man robs petrol from petrol bunk in andhra pradesh cctv footage

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ మండుతున్నాయి. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 121 రూపాయలకు చేరింది. దీంతో గతంలో ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాల నుంచి పెట్రోల్ చౌర్యం జరిగినట్టుగా ఇప్పుడు కూడా పెట్రోల్ దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే చిన్నచిన్నగా ఏం దొంగతనం చేస్తామని అనుకున్నారో.. ఏమో కానీ.. ఏకంగా నలబై లీటర్ల పెట్రోలును ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ చేసిన దొంగలను అక్కడే ఉన్న ఓ చిన్నారి చిట్టి సిసి కెమెరా పట్టింది. అయితే ఒకడే దోంగ ఈ తతంగానికి శ్రీకారం చుట్టారని అనుకుంటే ఏకంగా ముగ్గురు దొంగల గుట్టు రట్టు అయ్యింది.

పెట్రోల్ కొనడం అంటే ఇక మధ్యతరగతి, ఉన్నత వర్గాలకు మాత్రమే దక్కే అవకాశంగా పేదలు, దిగువ మధ్యతరగతి వారు చర్చించుకుంటున్న కాలం వచ్చేసింది. ఓ వైపున చూస్తే మన ఇంధన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మాత్రం.. ఇంధన ధరలు ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశంలో కేవలం ఒక్క శాతం కూడా పెరగలేదనిసాక్ష్యాత్తు పార్లమెంటులో ప్రకటన చేస్తున్నారు. ఇది విన్నవారు ఏదీ నిజమో తేల్చుకోలక పోతున్న సమయంలో.. వీరు మాత్రం తమకు ఎందుకోచ్చిన పంచాయితీ.. తాము కొనేదుందా..? పెట్టేదుందా..? మధ్యరాతిరిలో పెట్రోల్ బంకుకు వెళ్తే సరి అని అనుకున్నారు. ఇంతకీ వీరు ఎవరు..? ఎందుకలా అనుకున్నారు.? అన్న వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే..

నిషీధి అర్ధరాత్రి వేళ.. అంతా గాఢనిద్రలోకి జారుకున్న తరువాత.. ఓ యువకుడు ఓ పెట్రోల్ బంకులో గుట్టుచప్పుడు కాకుండా వెళ్లాడు. అక్కడి సిబ్బందితో పాటు సెక్యూరిటీ కూడా నిద్రలోకి జారుకున్నారు. ముందుగా బయటి నుంచి వారు నిద్రిస్తున్న రూమ్ గడియ పెట్టారు. ఆ తర్వాత 40 లీటర్ల పెట్రోల్‌ను రెండు 20 లీటర్ల క్యాన్లలో నింపుకొని అక్కడి నుంచి ఉడాయించారు. ఉదయం నిద్రలేచిన తరువాత విధులకు హాజరైన సిబ్బంది మీటర్ రీడింగ్ చూసి అనుమానం వ్యక్తం చేశారు. ఎంత వేసవి కాలం అయినా ట్యాంకు నుంచి పెట్రోల్ అవిరవుతుంది కానీ.. పంపు నుంచి ఏకంగా లీటర్ల కొద్ది పెట్రోల్ వెళ్లడం నమోదు కావడంతో అనుమానం వ్యక్తం చేశారు.

మీటర్ రీడింగ్ లో నిన్నటి క్లోజింగ్ సమయానికి.. ఇవాళ్టి తెరచిన సమయానికి తేడా ఉందని చెప్పడంతో సిసిటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన వీడియోలను పరిశీలించారు. దీంతో పంపులోకి ఓ వ్యక్తి రెండు 20 లీటర్ల క్యాన్లు తీసుకుని వచ్చిన పెట్రోల్ నింపుకుని వెళ్లాడని, అయితే అతనికి మరో ఇద్దరు సాయం కూడా చేశారని సీసీటీవీ కెమెరాల్లో వెల్లడైంది. దీంతో దొంగల గుట్టు భట్టబయలైంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు సిసి కెమెరాలను పరిశీలించి.. దొంగలను పట్టుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని పెట్రోల్ బుంకులో చోటుచేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  20 litres water cans  Petrol bunk  cctv cameras  Prathipadu  Guntur  Andhra Pradesh  Crime  

Other Articles