భార్యాభర్తలు తమ సంపారజీవితం కొనసాగించలేక విడిపోయినప్పుడు భర్త నుంచి భార్య భరణం కోరడం అందరికీ తెలిసిన విషయమే. అయితే హింధూ వివాహచట్టం ప్రకారం చాలామందికి తెలియని విషయం ఏమిటంటే భార్యలు కూడా భర్తలకు భరణం ఇవ్వాల్సిన రావడం. ఇప్పుడిదే వార్తు న్యాయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ మహారాష్ట్రకు చెందిన ఓ భర్త తర భార్య నుంచి భరణం కోసం కోర్టుకెక్కి విజయం సాధించాడు. ఔరా.. ఇది వినడానికే విచిత్రంగా ఉంది అంటారా.. నిజమే.. కానీ ఈ మేరకు బాంబే హైకోర్టు కూడా భర్తకు అనుకూలంగానే తీర్పును వెలువరించింది.
మహారాష్ట్రలో జరిగిన ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఓ మహిళకు 1992లో వివాహమైంది. పెళ్లయిన తర్వాత చదువు కొనసాగించిన ఆమె ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వ ఉద్యోగం పొందింది. అయితే, భర్త తనను వేధిస్తున్నాడని, అతడి నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ 2015లో ఆమె నాందేడ్ సివిల్ కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం కోర్టు ఆ భార్యభర్తలకు విడాకులు మంజూరు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. తననుంచి తన భార్య విడిపోతానంటోందని, అందుకు సమ్మతం తెలిపిన అమె భర్త.. అమె విడిపోతున్నందుకు తనకు భరణం ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు.
తానే తన భార్య చదవుకు దోహదపడ్డానని, అంతేకాదు అమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేందుకు కూడా తాను అహర్నిశలు కష్టపడ్డానని.. అమకు ఏ సమయానికి ఏమి కావాలో అన్ని సమకూర్చి.. అటు ఇంటి పనులు, బయటిపనులు అన్ని తానే చూసుకున్నానని, ఈ క్రమంలో అమెకు ఉద్యోగం వచ్చేవరకు తాను చిన్నాచితక పనులతో కుటుంబాన్ని పోషించానని చెప్పారు. ఇక అమెకు ఉద్యోగం రావడంతో తనను పనులు మాన్పించివేసిందని.. ఇంటిపట్టునే ఉంటున్నానని చెప్పాడు. ఇప్పుడామె విడాకాలు తీసుకుని వెళ్లిపోతే తనకు జీవనాధారం ఏమీ లేదని, కాబట్టి ఆమె నుంచి తనకు భరణం ఇప్పించాలంటూ భర్త కోర్టుకెక్కాడు. విచారించిన అదే కోర్టు భర్తకు ప్రతినెల 3 వేల రూపాయలు భరణంగా చెల్లించాలని 2017లో ఆమెను ఆదేశించింది.
అయితే, కోర్టు ఆదేశాలను ఆమె ధిక్కరించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఆమె ఇన్నాళ్లూ చెల్లించాల్సిన భరణం బకాయిల మేరకు ఆమె వేతనం నుంచి ప్రతినెల రూ.5 వేలు పక్కనపెట్టి ఆ సొమ్మును తమకు పంపాలంటూ 2019లో ఆమె పనిచేస్తున్న స్కూలు ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించింది. దీంతో ఆమె నాందేడ్ సివిల్ కోర్టు ఇచ్చిన రెండు తీర్పులను సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అయితే, అక్కడా ఆమెకు ఎదురుదెబ్బే తగిలింది. నాందేడ్ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు ధర్మాసనం.. జీవనాధారం లేని భర్తకు భార్య భరణం చెల్లించాల్సిందేనని స్పష్టమైన తీర్పు చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more