కర్ణాటక, బెంగళూరులో హృదయవిదారక సంఘటన జరిగింది. ఎదిగిన కూతురికి పెళ్లి చేయాలని చక్కని సంబంధం చూసిన తండ్రి.. ఇక త్వరలో ఎంగేట్ మెంట్ నిర్వహించేందుకు స్థానికంగా ఉన్న కల్యాణ మండపం బుక్ చేసి తిరిగి ఇంటికి చేరుకుంటున్న తరుణంలో రోడ్డు పక్కన ట్రాన్స్ఫార్మర్ పేలి అతని ప్రాణాలను బలితీసుకుంది. తీవ్రగాయాలపాలైన అతని కూతురు కూడా అసుపత్రిలో చికిత్స పోందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. దీంతో కర్ణాటకలోని మంగనహళ్లి ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి, తనయల ప్రాణాలు పోవడానికి బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థ (బెస్కమ్) నిర్క్లక్యమే కారణం.
వివరాల్లోకి వెళ్తే.. మంగనహళ్లి ప్రాంతంలోని ఉళ్లాల్ లో నివసించే శివరాజ్(55).. ఇటీవల తన కూతురు చైతన్య (25)కు వివాహ సంబంధాన్ని కుదుర్చుకున్నారు. త్వరలోనే నిశ్చితార్థం చేయాలని ఇరు తరపువారు నిర్ణయించుకున్నారు. దీంతో స్థానిక మంగనహళ్లిలో ఉన్న కన్వెన్షన్ హాలును బుక్ చేసుకునేందుకు తన కూతురుతో కలసి వెళ్లిన శివరాజ్.. హాలు బుక్ చేసి తిరిగి వస్తున్న క్రమంలో అక్కడున్న వంతెను దాటి.. రోడ్డు మరోవైపు దాటడానికి స్కూటీని రోడ్డు పక్కనే ఆపాడు. ఆ సమయంలోనే అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలింది. ట్రాన్స్ఫార్మర్లోని ఆయిల్ చిల్లి వారిపై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారి పరిస్థితి విషమంగా మారింది.
ఈ ఘటనతో స్థానికులు ఓక్కాసారిగా అలర్ట్ అయ్యి వారిని స్థానికి విక్టోరియా అసుపత్రికి తరలించారు. కాగా, సుమారు 80శాతం మేర కాలిన గాయాలతో శివరాజ్ కొద్దిసేపటికే మరణించగా, అర్థరాత్రి సమయంలో ఆయన కూతురు చైతన్య కూడా మరణించారు. స్థానికంగా చాలా రోజులుగా ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆయిల్ కారుతుందని స్థానికులు ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ విద్యుత్ సంస్థ కంపెనీ సిబ్బంది స్పందించలేదని.. దీంతోనే ఇప్పుడు పెళ్లింట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుందని స్థానికులు అరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more