హిజాబ్తోనే తాము విద్యాలయాలకు వస్తామంటూ భీష్మించిన ఉడుపి ముస్లిం విద్యార్థినులు అన్నంత పనీ చేశారు. విద్యాలయాల్లోకి హిజాబ్ను అనుమతించరాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ విద్యార్థినులు.. హిజాబ్ను అనుమతించేదాకా క్లాసులకు వెళ్లబోమంటూ మంగళవారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న చెప్పిన మాట ప్రకారమే బుధవారం నాడు వాళ్లంతా క్లాసులకు డుమ్మా కొట్టారు. అంతేకాకుండా తాము హాజరుకావాల్సిన పరీక్షలకు కూడా వారు గైర్హాజరయ్యారు.
తమను హిజాబ్తో పాఠశాలలోకి రానివ్వలేదంటూ ఉడుపి జిల్లాకు చెందిన ఆరుగురు ముస్లిం విద్యార్ధినులు నేరుగా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఒక్క కర్ణాటకనే కాకుండా యావత్తు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు.. విద్యాలయాల్లోకి హిజాబ్కు అనుమతి లేదని తేల్చేసింది. ఈ తీర్పు తమకు న్యాయం చేయలేదని వ్యాఖ్యానించిన విద్యార్ధినులు హిజాబ్ను అనుమతించేదాకా తాము క్లాసులకే హాజరు కాబోమంటూ పేర్కొన్నారు. అంతేకాదు, హైకోర్టు తీర్పును వారు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి కూడా తెలిసిందే.
కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించింది. హోలీ సెలవుల తర్వాత ఈ పిటిషన్పై విచారణ చేపట్టనున్నట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని ఓ విద్యాలయం యాజమాన్యం హిజాబ్తో వచ్చిన విద్యార్థులను నిలిపేసింది. హిజాబ్ తీసేసి.. స్కూల్ డ్రెస్తో మాత్రమే విద్యాలయంలోకి ప్రవేశించాలని ఆదేశించింది. దీనికి నిరాకరించిన విద్యార్థులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో హిజాబ్ను విద్యాలయాల్లో నిషేధించాలంటూ మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
దీంతో ఈ పిటిషన్లన్నింటినీ కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వివాదంపై మంగళవారం కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించింది. విద్యాలయాల్లోకి హిజాబ్ను అనుమతించడానికి వీల్లేదంటూ కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుతో తమకు న్యాయం జరగలేదని భావించిన విద్యార్థులు మంగళవారమే సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదని, హోలీ సెలవుల తర్వాత విచారణ చేపడతామని తేల్చి చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Jul 01 | రాష్ట్రంలో ఆన్లైన్ సినిమా టికెట్ల విధానం అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ సర్కారుకు చుక్కెదురైంది. జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 69పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం... Read more
Jul 01 | ఐబిపిఎస్ (IBPS) క్లర్క్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 6035 క్లర్క్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి... Read more
Jul 01 | తన కారు డ్రైవర్ హత్యాభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ను న్యాయస్థానం మరోమారు పొడిగించింది. గత మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు రిమాండ్ గడువు నేటితో... Read more
Jul 01 | మారుతున్న పనివేళలు, ఉద్యోగ కల్పన ఇత్యాదుల నేపథ్యంలో నూతన కార్మిక చట్టాలను తీసుకురావాలని కేంద్రప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 1 నుంచి ఈకొత్త కార్మికచట్టాలను అమలుపర్చాలని చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది.... Read more
Jul 01 | మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ముగిసి.. శివసేన రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ న్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నావిస్ ఢిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ తరుణంలో.. ప్రజలకు... Read more