తెలంగాణ తిరుపతిగా బాసిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని ప్రసాదాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావించి.. కళ్లకు అద్దుకుని మరీ తింటారు. కానీ.. ఈ స్వామివారి ప్రసాదం తయారు చేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం భక్తుల ప్రాణాల మీదకు తీసుకువస్తోంది. ప్రసాదం తయారీని కూడా సిబ్బంది ఎంతో భక్తిప్రవత్తులతో నిర్వహించాల్సి వుండగా, వారు నిర్లక్ష్యం కారణంగా ప్రసాదంలో గాజుముక్కలు దర్శనమిస్తున్నాయి. ఈ గాజుముక్కలను చూడకుండా భక్తులు తిన్నపక్షంలో.. లేదా చిన్నారులు అరగిస్తే ఎంతటి ప్రమాదమో ఊహించుకునేందుకే కష్టంగా ఉంది.
అయితే ఈ దారుణ అనుభూతిని పోందాడు ఓ భక్తుడు. అదృష్టవశాత్తు అతడు కొంత ప్రసాదాన్ని తీసుకుని నోట్లు వేసుకునే సమయంలో గాజు సీసం ముక్క కనిపించడంతో కలవరానికి గురయ్యాడు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి ప్రసాదాలు నిర్వహించే సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా.? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రసాదం తయారీలో సిబ్బంది అజాగ్రత్త.. భక్తుల ప్రాణాల మీదకు వస్తోందనే విమర్శించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటనే దీనికి నిదర్శనం. సికింద్రాబాద్లోని పద్మారావు నగర్కు చెందిన రఘు ఆదివారం రోజున కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి క్షేత్ర సందర్శనకు వెళ్లారు.
బాలాయంలోని లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న తరువాత స్థానికంగానే ఉండే పాతగుట్ట ఆలయంలో నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడి కౌంటర్లో ప్రసాదం కొనుగోలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కూర్చొని.. కుటుంబంతో సహా ప్రసాదం తింటుండగా.. పులిహోరలో గాజుముక్క కనిపించింది. వెంటనే అప్రమత్తమై తన పిల్లల వద్ద ఉన్న ప్రసాదాన్ని రఘు తీసుకున్నారు. ప్రసాదంలో సీసం ముక్కలు ఉన్నాయని.. తినొద్దని వారించారు. ప్రసాదాల తయారీలో అజాగ్రత్త భక్తుల ప్రాణాలను ప్రమాదాన్ని తెస్తుందని రఘు ఆరోపించారు. కాగా, ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆలయ ఏఈవో శ్రవణకుమార్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more