రైలు ప్రయాణంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ప్రమాదాలు మాత్రం సంభవిస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా రైలు ఎక్కేటప్పుడు.. దిగేటప్పుడు తప్పకుండా రైలు ఆగిన తరువాతే దిగాలని రైల్వే యాజమాన్యం ప్రయాణికులకు సూచనలు చేస్తూనే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. అనునిత్యం కొత్తప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు కాబట్టి రైల్వే అధికారులు నిత్యం సూచనలు చేస్తూనే వుంటారు. ట్రయిన్ రన్నింగ్ లో ఉండగా మాత్రం రైలు ఎక్కడం కానీ, దిగడం కానీ చేయకూడదని పదే పదే చెబుతుంటారు. అయినా పెడచెవిన పెడుతూ తమను కాద అన్నట్లు వ్యవహరించే కొందరు ప్రయాణికులు ప్రమాదపుటంచులకు చేరకుంటారు.
ప్యాసింజర్లు చేసే చిన్న తప్పిదాల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది కదులుతున్న రైలు ఎక్కబోతూ కిందపడిపోతుంటారు. ప్లాట్ఫామ్, రైలు మధ్యలో ఇరుక్కుపోతుంటారు. కొందరు ట్రాక్స్ మీద పడిపోతుంటారు. ఇలా చాలా రకాలుగా రైల్వే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా గుజరాత్లోని సూరత్ రైల్వే స్టేషన్లో ఓ ఘటన చోటు చేసుకుంది. సూరత్ స్టేషన్ నుంచి ఓ ట్రెయిన్ బయలుదేరింది. నెమ్మదిగా స్పీడ్ పెరుగుతోంది. ఇంతలో ఓ ప్యాసెంజర్.. ట్రెయిన్ నుంచి దిగబోయాడు. జారి కిందపడ్డాడు. ప్లాట్ఫామ్, రైలు మధ్యలో పడిపోయాడు.
దీంతో ప్రయాణికులంతా గట్టిగా అరిచేసరికి… వెంటనే అప్రమత్తమైన ట్రెయిన్ డ్రైవర్(రైల్వే గార్డ్) వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్స్ వేశాడు. రైలు ఆగగానే.. ఆ ప్రయాణికుడు ప్లాట్ఫామ్ నుంచి పైకి లేచాడు. మరణాన్ని వెంటుకవాసిలో తప్పించుకుని తనకేమీ జరగనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ ఈ భయానక వీడియోను చూసిన నెటిజనులు మాత్రం రైలు ఆగిన తరువాత దిగితే.. ఇంతటి ప్రమాదంలో పడాల్సిన పనిలేదు కదా.? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక అతని అదృష్టం కోద్దీ ఎటువంటి గాయాలు కాకుండా బయటపడటంతో అక్కడివారంతా ట్రెయిన్ డ్రైవర్ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— Ministry of Railways (@RailMinIndia) March 1, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more