బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను దాణా కుంభకోణం కేసు ఇప్పటికీ వెంటాడుతోంది. ఈ కేసులో ఇప్పటికే శిక్షను అనుభవించిన ఆయనకు తాజాగా ఈ కేసులో మరో కోర్టు కూడా ఆయనను దోషిగా తేల్చింది. దీంతో ఆయనకు మరోమారు శిక్ష పడటం నిశ్చితమైంది. దొరండా ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులు ఖాళీ చేసిన కేసులో రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. జడ్జి సీకే శశి ఆదేశాల మేరకు లాలూ ప్రసాద్ ఇవాళ భౌతికంగా కోర్టుకు హాజరయ్యారు. లాలూతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 98 మందిని కూడా వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
1996లో తొలిసారి దొరండా ట్రెజరీ కేసు నమోదు అయ్యింది. ఆ సమయంలో 170 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసుతో సంబంధం కలిగిన 55 మంది ఇప్పటికే మరణించారు. దాణా కుంభకోణంలో దొరండా ట్రెజరీ కేసులో అయిదవది. ఈ కేసులో 24 మందిని నిర్ధోషులుగా పేర్కోన్న న్యాయస్థానం.. 35 మందిని దోషులుగా పేర్కోంది. వీరిలో అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ దృవ్ భగత్ కూడా వున్నారు. కాగా తాజాగా న్యాయస్థానం విధించిన శిక్ష నేపథ్యంలో వీరు బెయిల్ పిటీషన్ దాఖలు చేసేందుకు అర్హత సంపాదించారు. మొత్తం 950 కోట్ల దాణా కుంభకోణంలో దొరండాకు సంబంధించి లాలూ సహా దోషులందరూ కలసి ఏకంగా రూ.139 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు.
దీంతో న్యాయస్థానం ఈ కేసులో నిందితులందరినీ దోషులుగా నిర్థారించింది. వారిపై మోపబడిన అభియోగాలు.. న్యాయవిచారణలో నిజమని తేలింది. లాలూ ప్రసాద్ ప్రభుత్వం పశువుల మేత కోసం నిధులు దుర్వినియోగం చేసినట్లు కేసులు నమోదు అయ్యాయి. దాణా కుంభకోణం కేసులో 14 ఏళ్ల జైలుశిక్ష పడగా.. లాలూ ఇప్పటి వరకు 3.5 ఏళ్లు జైలు జీవితాన్ని అనుభవించారు. దొరండా ట్రెజరీ కేసులో ఆయనకు మూడేళ్లకు మించి శిక్ష పడితే మళ్లీ జైలు జీవితాన్ని ఆయన గడపాల్సి వస్తుంది. ఈ కేసులో 36 మందికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. లాలూ ప్రసాద్ యాదవ్ సహా మరికొందరికి ఈ నెల 21న న్యాయస్థానం శిక్షను ప్రకటించనుందని డిఫెన్స్ లాయర్ సంజయ్ కుమార్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more