తిరుమల తిరుపతి దేవస్థానంపై శ్రీ హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. భక్తుల విశ్వాసాలు, నమ్మకాలను పక్కద్రోవ పట్టించి.. చరిత్రను కాదని అసత్య కథనాలను ప్రచారం చేయడంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నాలు చేస్తోందని ఆయన అరోపించారు. హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రిలో జన్మించలేదని ఆయన అన్నారు. కర్ణాటక కిష్కింధలోని పంపానది క్షేత్రంలోనే హనుమంతుడు జన్మించారని చెప్పారు. తిరుపతిలో గోవిందానంద సరస్వతి మీడియాతో మాట్లాడుతూ... తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దైవద్రోహం చేస్తున్నదని విమర్శించారు.
దేశంలోని హైందవులను మోసం చేయడానికి టీటీడీ యత్నిస్తోందని అరోపించారు. కేవలం ధనం ఉందని అసత్యకథనాలు సృష్టిస్తోందని ఆయన పేర్కోన్నారు. సన్యాసులను, చరిత్రకారులను, భక్తులను, ప్రజలను టీటీడీ మోసం చేస్తోందని, అంజనాద్రి పేరుతో తిరుమలలో దుకాణాలు ఏర్పాటు చేయడానికి, టీటీడీ ప్రయత్నాలు జరుపుతున్నారని విమర్శించారు. డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపణలు గుప్పించారు. మరోవైపు, రూ.1200 కోట్లతో కిష్కింద అభివృద్ధికి కర్ణాటక సీఎం ఇప్పటికే ప్రకటన చేశారని, కిష్కిందలోని పంపా తీరంలోనే హనుమంతుడు పుట్టాడని అందరూ అంగీకరించారని గోవిందానంద సరస్వతీ స్పష్టం చేశారు.
హనుమంతుని జన్మస్థలం పేరుతో నకిలీ పుస్తకం ముద్రించి తిరుమల తిరుపతి దేవస్థానం మోసగిస్తున్నదని అన్నారు. హనుమంతుని జన్మస్థలం విషయంలో గందరగోళం సృష్టించారని, సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగించేవారిని వదలిపెట్టబోమని హెచ్చరించారు. వాల్మీకీ రామాయణంలో హనుమంతుడి జన్మస్థలంపై అప్పుడే వాల్మీకీ మహర్షి వివరించారని ఆయన అన్నారు. హనుమత్ జన్మతీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టామని, 12 ఏండ్ల పాటు రథం దేశవ్యాప్తంగా తిరుగుతుందని చెప్పారు. కిష్కింధ హనుమంతుని జన్మస్థలమని రథయాత్ర సందర్భంగా ప్రజలకు చెప్తామన్నారు. రూ.1,200 కోట్లతో కిష్కింధ అభివృద్ధిని కర్ణాటక సీఎం ప్రకటించారని గోవిందానంద తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more