పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయంలో రోజుల తరబడి ఉత్కంఠకు తెరదించుతూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రిగా కోనసాగుతున్న చరణ్జీత్ సింగ్ చన్నీ పేరును ఖరారు చేసింది హస్తం పార్టీ. లూథియానాలో జరిగిన వర్చువల్ సభలో రాహుల్ గాంధీ ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రకటించగానే చన్నీ.. పక్కనే కూర్చున్న పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాదాలను తాకి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం తీవ్రస్థాయిలో పోటీ పడ్డ సిద్ధూ, చన్నీ ఈ వేదికపై పక్కపక్కనే కూర్చున్నారు. రాహుల్.. చన్నీ పేరును ప్రకటించగానే పక్కనే ఉన్న సిద్ధూ ఆయనను అభినందించారు. ఆయనను గుండెలకు హత్తుకున్నారు. చన్నీ చేయి పైకెత్తి అభివాదం చేయించారు. ఆ సమయంలో చన్నీ.. సిద్ధూ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ వచ్చి సిద్ధూ, చన్నీలను ఆత్మీయంగా హత్తుకున్నారు. అనంతరం చన్నీ మాట్లాడుతూ.. ‘‘సిద్ధూజీ.. మీ సూచనలను మేం అమలు చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు.
పంజాబ్లో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై గత కొన్ని రోజులుగా ఉత్కంఠ కొనసాగింది. ముఖ్యంగా ఈ అభ్యర్థిత్వానికి పోటీ పడిన సిద్ధూ.. ఇటీవల సీఎం ఎంపిక విషయంలో పార్టీ హైకమాండ్ను టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టాప్లో ఉన్నవారు బలహీనమైన వ్యక్తి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. అయితే పార్టీ నిర్ణయం ఏదైనా దాన్ని తాను స్వాగతిస్తానని చెప్పిన సిద్ధూ.. నిన్న కూడా మరోసారి అదే విషయాన్ని చెప్పారు. ‘‘నిర్ణయాలు తీసుకునే అధికారం నాకు ఇవ్వకపోయినా.. తదుపరి సీఎంకు నేను మద్దతిస్తాను’’ అని అన్నారు. కానీ, చివర్లో తానేమీ షోపీస్ కాదని చెప్పడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more