యూట్యూబర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫేం సరయు రాయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె రూపొందించిన ఓ లఘు చిత్రం ఓ వర్గం మనోభావాలను గాయపర్చేలా ఉన్నాయని, మహిళలను కించపరిచేలా ఉందంటూ పిర్యాదు రావడంతో పోలీసులు అమెపై కేసు నమోదు చేశారు. అమెతో పాటు అమె బృందంపై కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సరయు, ఆమె బృందం ఇటీవల రూపోందించిన ఓ లఘు చిత్రం హిందూవుల మనోభావాలను గాయపర్చేలా వున్నాయని దాంతో పాటు మహిళలను కూడా కించపర్చేలా వున్నాయని పిర్యాదు నమోదైంది.
ఈ మేరకు సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్లలో ఫిర్యాదు చేయగా, ఆ వీడియోను హైదరాబాద్లోని ఫిలింనగర్లో చిత్రీకరించినట్టు తేలింది. దీంతో కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ‘7ఆర్ట్స్’ పేరుతో సరయు, ఆమె బృందం ఓ యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ‘7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్’ కోసం వీరు ఒక లఘు చిత్రాన్ని రూపొందించి గతేడాది ఫిబ్రవరి 25న తన చానల్తోపాటు సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే ఈ లఘు చిత్రం విమర్శలను ఎదుర్కోడంతో పాటు హిందువుల మనోభావాలను గాయపర్చేలా ఉందని పిర్యాదు వచ్చింది.
మహిళలను కూడా అగౌరవంగా చిత్రీకరించడంతో పాటు కించపర్చేలా రూపోందించారని వీహెచ్ పీ నేత పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసును హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ కు బదలాయించారు. ఇందులో సరయు, ఆమె బృందం తలకు ‘గణపతి బొప్పా మోరియా’ అని రాసి ఉన్న బ్యాండు ధరించారు. ఈ వీడియో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా ఉందని, అంతేకాకుండా మద్యం తాగి హోటల్కు వస్తారన్న ప్రచారం కూడా జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more