రోడ్డుపై పది రూపాయలు దొరికినా.. మనదేనని బుకాయించి జేబులో వేసుకునేవారి సంఖ్య అధికమైన ఈ రోజుల్లో.. ఇంకా నీతిగా, నిజాయితీగా లక్షల విలువైన వస్తువులు లభించినా దానిని సంబంధిత వ్యక్తులకు అందజేయాలని కొరుతూ అధికారులకు అప్పగించేవారు ఇంకా ఉన్నారు. ఈ మధ్యకాలంలో అలాంటి అటో డ్రైవర్లను కొంతమందిని మనం చూస్తూనే వున్నాం. అలాంటివారి కోవకే చెందినవారు అష్రఫ్ మొయిద్దీన్. ఇంతకీ ఈయన ఎవరు.? ఏం చేశారు. తన నిజాయితీని ఎలా చాటుకున్నారు అని అంటారా.?. ఈ వివరాల్లోకి వెళ్తే.. అష్రప్ మొయిద్దీన్ అనే వ్యక్తి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో నాల్గవ తరగతికి చెందిన ఉద్యోగి.
విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ప్రయాణికులు తమ వస్తువులను ట్రాలీలపై పెట్టుకుని తమ వాహనాల వద్దకు చేరుకోవడం కామన్. అయితే అలా వారు వదిలిన ట్రాలీలను ఒక్క దగ్గరకు చేర్చి విమానాశ్రయంలోకి తీసుకెళ్లి పెట్టే విధులు నిర్వహిస్తున్నారు అష్రప్. కాగా ఆయన ఇలా విధులు నిర్వహిస్తున్న తరుణంలో ఆయన విమానాశ్రయంలోని దిగువ అంతస్థులో బయటకు వెళ్లే మార్గంలో వజ్రాల పొదిగిన కంకణం (మహిళలు చేతికి ధరించే గాజు) లభించింది. దానిని ఎవరో పారేసుకున్నారని భావించిన అష్రఫ్ విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్ అధికారులకు అందజేశారు. దీంతో అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు.
కాగా వజ్రాలు పొదిగిన ఈ కంకణం బెంగళూరు నుంచి వచ్చిన తన బంధువును రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ప్రయాణికురాలి బంధువుకు చెందినది. తన కంకణం తప్పిపోయిందని ఇంటికి వెళ్లిన తరువాత తెలుసుకున్న అమె.. విమానాశ్రయంలోనే ఇది పడివుంటుందని భావించి.. వెంటనే దానిని గుర్తించాలని విమానాశ్రయంలోని సంబంధిత అధికారులకు సమాచారం అందించింది. దీంతో అమె పిర్యాదును నమోదు చేసుకున్న సీఐఎస్ఎఫ్ అధికారులు అమెను విమానాశ్రయానికి రమ్మని చెప్పారు. అమె రాగానే వెంటనే దానిని గుర్తించడమే కాకుండా ఎంతో నిజాయితీగా అధికారుల వద్దకు తీసుకువచ్చి అప్పగించిన అష్రఫ్ వద్దకు వెళ్లి ఆయన చేతనే దానిని కోల్పోయిన వ్యక్తికి ఇప్పించారు.
పార్కింగ్ లాట్ లో ట్రాలీలను ఒక్కచోటకు చేరుస్తున్న అష్రఫ్ మొయిద్దీన్ అనే ట్రాలీ కూలీ వద్దకు సీఐఎస్ఎఫ్ అధికారులు అమెను తీసుకెళ్లారు. అక్కడ విదులు నిర్వహిస్తున్న అష్రఫ్ ను పిలిచి ఆయన చేత్తోనే అమెకు ఆ వజ్రాలు పోదిగిన కంకణాన్ని అందించారు. అయితే అంతుకుముందు విమానాశ్రయంలోని లాస్ట్ అండ్ ఫౌండ్ డిమార్టుమెంటు మేనేజరు సదరు ప్రయాణికురాలి ఐడెంటిటీని పరిశీలించిన తరువాత ఈ కార్యక్రమం జరిగింది. కాగా, ఈ సందర్భంగా అష్రప్ స్పందిస్తూ. విలువైన కంకణాన్ని స్వీకరించినందుకు ప్రయాణీకురాలి ముఖంలో కనిపించిన సంతోషం.. తనకు అత్యంత సంతృప్తిని కలిగించిందని అన్నారు. అయితే అష్రఫ్ ఇలా తన నిజాయితీని చాటుకోవడం రెండో పర్యాయమని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more