పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్ను ఇండియా కొనుగోలు చేసినట్లు అమెరికాకు చెందిన న్యూ యార్క్ టైమ్స్ పత్రిక ఓ సంచలన కథనాన్ని రాసిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ దేశంలో ఈ వ్యవహారం విషయమై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు సంధిస్తున్నాయి. పెగసస్ స్పైవేర్ను 2017లోనే భారత ప్రభుత్వం కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. దీనిపై ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ సర్కార్ దేశద్రోహానికి పాల్పడినట్లు ఆయన తన ట్విట్టర్లో ఆరోపించారు.
దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై నిఘా పెట్టేందుకు మోదీ సర్కార్ ఇజ్రాయిల్ నుంచి పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసినట్లు రాహుల్ విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజకీయవేత్తలు, ప్రజలపై ఆ స్పైవేర్తో నిఘా పెట్టినట్లు ఆయన ఆరోపించారు. గవర్నమెంట్ సంస్థలు, ప్రతిపక్ష నేతలు, సైనిక దళాలు, న్యాయవ్యవస్థతో లింకున్న వారి ఫోన్లను పెగాసస్తో ట్యాప్ చేసినట్లు రాహుల్ ఆరోపించారు. ఇవన్నీ దేశద్రోహ పనులే అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి వీకే సింగ్ తీవ్రంగా మండిపడ్డారు.
అదొక ‘సుపారీ మీడియా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఇండియాలోని ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు పెగసస్ అనే స్పైవేర్ను కేంద్ర ప్రభుత్వం వినియోగించిందన్న వార్తలు సంచలనం సృష్టించాయి. పార్లమెంట్ను సైతం ఈ అంశం కుదిపేసింది. అయితే, ఈ వార్తలను కేంద్రం అప్పట్లోనే ఖండించింది. అలాంటి స్పైవేర్ ఏదీ కొనుగోలు చేయలేదని వివరణ ఇచ్చింది. అయితే తాజాగా న్యూయార్క్ టైమ్స్ మాత్రం 2017లోనే కేంద్రం ఈ స్పైవేర్ను కొన్నదంటూ
Modi Govt bought Pegasus to spy on our primary democratic institutions, politicians and public. Govt functionaries, opposition leaders, armed forces, judiciary all were targeted by these phone tappings. This is treason.
— Rahul Gandhi (@RahulGandhi) January 29, 2022
Modi Govt has committed treason.
ఓ కథనాన్ని ప్రచురించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more