సరిగ్గా దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున దేశరాజధాని న్యూఢిల్లీలో దారుణం జరిగింది. తన బిడ్డతో కలసి ఓ వీధిలో ఒంటరిగా నివసిస్తున్న మహిళపై ముగ్గురు స్థానికులు బహిరంగంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బహిరంగంగా జరుగుతున్న ఈ దారుణాన్ని అక్కడి మహిళలు అడ్డుకోవాల్సిందిపోయి అత్యాచారం చేస్తున్న మగవారికి మద్దతుగా నిలిచారు. తీవ్ర మానిసిక అందోళనకు గురైన అత్యాచార బాధితురాలిని అక్కడి మహిళలు మరింతగా అవమానించారు. అమెను శిరోముండనం చేసి, మెడలో చెప్పులదండేసి వీధుల్లో ఊరేగించారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని వివేక్ విహార్ కస్తూర్బా నగర్ లో గణతంత్ర దినోత్సవం రోజునే జరిగింది.
బాధితురాలి చెల్లెలి ఫిర్యాదుతో పాటు జాతీయ మహిళా కమీషన్ అదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు మహిళలను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు మాత్రం ఇప్పటికీ పరారీలోనే వున్నారు. అయితే బాధితురాలని స్థానిక మహిళలు దారుణంగా అవమానిస్తున్న తరుణంలో ఘటనను కొందరు స్థానికులు వీడియో తీసి నెట్టింట్లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ఇంతకీ బాధితురాలు చేసిన నేరం ఏమిటీ.? ఆమెను స్థానిక మహిళలు ఎందుకు టార్గెట్ చేశారు. అమెకు స్థానిక యువకుడి మరణానికి కారణం ఏమిటీ.? అన్న వివరాల్లోకి వెళ్తే.. భర్త చనిపోవడంతో.. ఉన్న తన ఒక్కగానొక్క కూతురితో కలిసి స్థానికంగా బతుకుతోంది.
ఆమె ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడు ఆమెను ఇష్టపడ్డాడు. అమెను పెళ్లి చేసుకుంటానని కూడా వెంటపడ్డాడు. అయితే అప్పటికే ఓ బిడ్డకు తలైన కారణంగా అమె యువకుడి ప్రేమను నిరాకరించింది. తన బిడ్డకు మంచి భవిష్యత్తు కోసమే తాను బతుకుతున్నానని చెప్పింది. అయితే బాధితురాలు నిరాకరించిన తరువాత కొన్నాళ్లకు అమె వెంట పడే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై ఆగ్రహం చెందిన ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆ మహిళపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. అమె కారణంగానే తమ బిడ్డ బలవన్మరణానికి కారణమని వారు భావించారు. సరిగ్గా గణతంత్ర దినోత్సవం రోజున సదరు బాధితురాలిని ఇంట్లో నుంచి బయటకు లాగారు. ముగ్గురు బహిరంగంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
అక్కడే ఉన్న మహిళలంతా ఆపాల్సిందిపోయి ఆ మగవారిని ప్రోత్సహించారు. సామూహిక అత్యాచారం తర్వాత బాధితురాలికి నిందితులు శిరోముండనం చేశారు.. చితకబాదారు.. మొహానికి నల్ల రంగు పూసి.. మెడలో చెప్పులదండ వేసి వీధులన్నీ తిప్పారు. ఆ వీడియోను చూసిన ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. 20 ఏళ్ల అమ్మాయిపై అక్రమ మద్యం అమ్మకందారులు దారుణానికి తెగబడ్డారని, దీనిపై ఢిల్లీ పోలీసులు 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీ విమెన్ కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ఆదేశించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు, వారికి సహకరించిన మహిళలపైనా కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. ఇంతకుముందు నిందితులపై అక్రమ మద్యం అమ్మకాలు, డ్రగ్స్ కార్యకలాపాలకు సంబంధించిన కేసులనూ తిరగదోడాలని సూచించారు.
कस्तूरबा नगर में 20 साल की लड़की का अवैध शराब बेचने वालों द्वारा गैंगरेप किया गया, उसे गंजा कर, चप्पल की माला पहना पूरे इलाक़े में मुँह काला करके घुमाया। मैं दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। सब अपराधी आदमी औरतों को अरेस्ट किया जाए और लड़की और उसके परिवार को सुरक्षा दी जाए। pic.twitter.com/4ExXufDaO3
— Swati Maliwal (@SwatiJaiHind) January 27, 2022
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more