సరిగ్గా దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున దేశరాజధాని న్యూఢిల్లీలో దారుణం జరిగింది. తన బిడ్డతో కలసి ఓ వీధిలో ఒంటరిగా నివసిస్తున్న మహిళపై ముగ్గురు స్థానికులు బహిరంగంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బహిరంగంగా జరుగుతున్న ఈ దారుణాన్ని అక్కడి మహిళలు అడ్డుకోవాల్సిందిపోయి అత్యాచారం చేస్తున్న మగవారికి మద్దతుగా నిలిచారు. తీవ్ర మానిసిక అందోళనకు గురైన అత్యాచార బాధితురాలిని అక్కడి మహిళలు మరింతగా అవమానించారు. అమెను శిరోముండనం చేసి, మెడలో చెప్పులదండేసి వీధుల్లో ఊరేగించారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని వివేక్ విహార్ కస్తూర్బా నగర్ లో గణతంత్ర దినోత్సవం రోజునే జరిగింది.
బాధితురాలి చెల్లెలి ఫిర్యాదుతో పాటు జాతీయ మహిళా కమీషన్ అదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు మహిళలను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు మాత్రం ఇప్పటికీ పరారీలోనే వున్నారు. అయితే బాధితురాలని స్థానిక మహిళలు దారుణంగా అవమానిస్తున్న తరుణంలో ఘటనను కొందరు స్థానికులు వీడియో తీసి నెట్టింట్లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ఇంతకీ బాధితురాలు చేసిన నేరం ఏమిటీ.? ఆమెను స్థానిక మహిళలు ఎందుకు టార్గెట్ చేశారు. అమెకు స్థానిక యువకుడి మరణానికి కారణం ఏమిటీ.? అన్న వివరాల్లోకి వెళ్తే.. భర్త చనిపోవడంతో.. ఉన్న తన ఒక్కగానొక్క కూతురితో కలిసి స్థానికంగా బతుకుతోంది.
ఆమె ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడు ఆమెను ఇష్టపడ్డాడు. అమెను పెళ్లి చేసుకుంటానని కూడా వెంటపడ్డాడు. అయితే అప్పటికే ఓ బిడ్డకు తలైన కారణంగా అమె యువకుడి ప్రేమను నిరాకరించింది. తన బిడ్డకు మంచి భవిష్యత్తు కోసమే తాను బతుకుతున్నానని చెప్పింది. అయితే బాధితురాలు నిరాకరించిన తరువాత కొన్నాళ్లకు అమె వెంట పడే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై ఆగ్రహం చెందిన ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆ మహిళపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. అమె కారణంగానే తమ బిడ్డ బలవన్మరణానికి కారణమని వారు భావించారు. సరిగ్గా గణతంత్ర దినోత్సవం రోజున సదరు బాధితురాలిని ఇంట్లో నుంచి బయటకు లాగారు. ముగ్గురు బహిరంగంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
అక్కడే ఉన్న మహిళలంతా ఆపాల్సిందిపోయి ఆ మగవారిని ప్రోత్సహించారు. సామూహిక అత్యాచారం తర్వాత బాధితురాలికి నిందితులు శిరోముండనం చేశారు.. చితకబాదారు.. మొహానికి నల్ల రంగు పూసి.. మెడలో చెప్పులదండ వేసి వీధులన్నీ తిప్పారు. ఆ వీడియోను చూసిన ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. 20 ఏళ్ల అమ్మాయిపై అక్రమ మద్యం అమ్మకందారులు దారుణానికి తెగబడ్డారని, దీనిపై ఢిల్లీ పోలీసులు 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీ విమెన్ కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ఆదేశించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు, వారికి సహకరించిన మహిళలపైనా కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. ఇంతకుముందు నిందితులపై అక్రమ మద్యం అమ్మకాలు, డ్రగ్స్ కార్యకలాపాలకు సంబంధించిన కేసులనూ తిరగదోడాలని సూచించారు.
कस्तूरबा नगर में 20 साल की लड़की का अवैध शराब बेचने वालों द्वारा गैंगरेप किया गया, उसे गंजा कर, चप्पल की माला पहना पूरे इलाक़े में मुँह काला करके घुमाया। मैं दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। सब अपराधी आदमी औरतों को अरेस्ट किया जाए और लड़की और उसके परिवार को सुरक्षा दी जाए। pic.twitter.com/4ExXufDaO3
— Swati Maliwal (@SwatiJaiHind) January 27, 2022
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more