లండన్ కు పారిపోయిన భారత ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా ఇప్పుడు నిలువనీడ కరువై నడిరోడ్డున పడ్డాడు. కోట్లాది రూపాయలను విచ్చలవిడిగా ఖర్చుపెట్టి అత్యంత విలాసవంతమైన వ్యాపారవేత్తగా, లిక్కర్ కింగ్ గా ప్రసిద్దిగాంచిన ఆయన తనకంటూ కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ ఇమేజ్ ను సోంతం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన నిజజీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కోంటున్నాడు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి.. ప్రజల డబ్బుతో విదేశాలకు ఉడాయిచిన ఆయనకు వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో లండన్లో ప్రస్తుతం మాల్యాకి నిలువ నీడ లేకుండా పోయింది.
స్విట్జర్లాండ్ కు చెందిన యూబీఎస్కు 20.4 మిలియన్ బ్రిటన్ పౌండ్ల చెల్లింపుల రికవరీ కేసుకి సంబంధించి లండన్ హైకోర్టులో కేసు నడుస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు వాయిదాలు పడుతూవస్తుండగా తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. లండన్లోని రిజెంట్ పార్క్లో ఉన్న కార్న్వాల్ టెర్రస్ లగ్జరీ అపార్ట్మెంట్ని అప్పు కింద జమ చేసుకోవచ్చంటూ యూబీఎస్ బ్యాంకికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు విజయ్ మాల్యా స్వచ్ఛందంగా ఇంటిని ఖాళీ చేయాలని లేదంటూ న్యాయాధికారుల సమక్షంలో ఖాళీ చేయించాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. లండన్ హైకోర్టు తీర్పుతో ఏన్నాళ్లుగానో విజయ్ మాల్యా తాను నివసిస్తున్న ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తోంది.
లండన్ ఇంటిని కాపాడుకునేందుకు విజయ్ మాల్యా విశ్వ ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలు మార్లు ఈ కేసుపై వాయిదాలు కోరుతూ వచ్చారు. వేరే బెంచ్కి మార్చేందుకు ప్రయత్నించారు. అయితే తాజా తీర్పులో న్యాయమూర్తి వీటన్నింటీని ప్రస్తావిస్తూ తీర్పు ఇచ్చారు. ‘ఇప్పటికే అప్పులు తీర్చేందుకు విజయమాల్యాకు అనేక అవకాశాలు ఇచ్చాం.. సరిపడ సమయం కల్పించాం.. ఐనప్పటికీ అప్పులు చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఈ కేసు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఏ న్యాయమూర్తి అయినా తనకంటే భిన్నంగా తీర్పు ఇవ్వరు. కాబట్టి మళ్లీ అప్పీల్ చేసుకోవడం కూడా వృధా అంటూ’ అప్పీల్ను సైతం న్యాయమూర్తి నిరాకరించారు.
లండన్లో ప్రస్తుతం మాల్యా నివసిస్తున్న లగ్జరీ అపార్ట్ మెంట్ లో అతని కొడుకు సిద్ధార్థ్ మాల్యా (34)తో పాటు విజయ్ మాల్యా తల్లి లలితా మాల్యా కూడా ఉన్నారు. ఆమె వయస్సు 95 ఏళ్లు. భారత్ బ్యాంకులను కోట్లాది రూపాయలమేర మోసం చేసి, బ్రిటన్ కు విజయ్మాల్యా పారిపోయారు. రుణాలు ఇచ్చిన బ్యాంకులన్నీ కన్సార్టియంగా ఏర్పడి ఎస్బీఐ నేతృత్వంలో న్యాయపోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే మాల్యాకు సంబంధించిన పలు ఆస్తులు అమ్మకానికి వచ్చాయి. ఇందులో చాలా వరకు మాల్యా పెద్దగా ఉపయోగించని ఫార్మ్హౌస్లు, లగ్జరీ యాచ్లే ఉన్నాయి. కానీ స్విట్జర్లాండ్ బ్యాంకు రుణాల రికవరీలో భాగంగా విజయ్ మాల్యా నివసించే ఇంటినే లాగేసింది. ఉన్నపళంగా ఆయన రోడ్డు మీదకు నెట్టేసింది.
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more